విజయ్ దేవరకొండ.. తాజా టాలీవుడ్ సంచలనం... ఇప్పుడు విజయ్ దేవరకొండ మరోసారి టాప్ హీరోలకు షాక్ ఇచ్చాడు. ఏకంగా బాహుబలి హీరోలు ప్రభాస్, రానా దగ్గుబాటిలనే వెనక్కి నెట్టేశాడు.. దేశంలోనే నాలుగో స్థానం సంపాదించి మరోసారి తన సత్తా చాటాడు. 


దేశంలోని టాప్ ఇంగ్లీష్ పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ఏటా మోస్ట్ డిజైరబుల్ మెస్ పేరిట సర్వే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో గత ఏడాది ప్రభాస్, రానా దగ్గుబాటి సత్తా చాటారు. బాహుబలి క్రేజ్‌తో ప్రభాస్ ఏకంగా దేశంలోనే సెకండ్ ప్లేస్ సాధించాడు. 

రానా కూడా బాహుబలి ఊపులో ఏడో ర్యాంకులో టాప్ టెన్‌లో నిలిచాడు. కానీ ఈ ఏడాది మాత్రం వీరిద్దరినీ నిరాశ పరిచింది. సెకండ్ ర్యాంక్ రానా ఈసారి 12 స్థానం సంపాదించి టాప్ టెన్‌లో ప్లేసు మిస్సయ్యాడు. అటు రానా కూడా 19 ర్యాంకుకు పడిపోయాడు. 


కానీ అందరి అంచనాలకు భిన్నంగా విజయ్ దేవరకొండ ఏకంగా దేశంలోనే నాలుగో ర్యాంకు సాధించి టాప్ టెన్‌లో నిలిచాడు. గత ఏడాద విజయ్ దేవరకొండ అసలు లిస్టులోనే లేడు. ఇక మిలిగిన టాలీవుడ్ హీరోల ప్రస్తావనే ఇందులో లేకపోవడం మరో విశేషం.



మరింత సమాచారం తెలుసుకోండి: