కత్రినా కైఫ్ అభినయంతో కంటే అందంతో నెట్టుకొస్తున్న హీరోయిన్.  టాలీవుడ్ లో మల్లీశ్వరి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యి... ఆ తరువాత బాలీవుడ్ కు వెళ్ళిపోయింది.  అలా బాలీవుడ్ కు వెళ్లిన ఈ హీరోయిన్... తిరిగి వెనక్కి చూసుకోలేదు.  బాలీవుడ్ లో అభినయం ఎలా ఉన్నా గ్లామర్ కు పెద్ద పీట వేస్తారు.  గ్లామర్ పాత్రలు చేస్తూ అలాగే నెట్టుకొస్తోంది ఈ అమ్మడు.  


కత్రినా కైఫ్... సల్మాన్ ఖాన్ ల మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది.  ఈ సానిహిత్యంతోనే ఆమె సినిమాలు చేస్తున్నది.  ప్రస్తుతం ఈ ఇద్దరు కలిసి భారత్ అనే సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా ఈద్ రోజున రిలీజ్ కాబోతున్నది.  ఇందులోని ఓ సెకండ్ సాంగ్ జిందా ను రిలీజ్ చేశారు.  ఈ సందర్భంగా సల్మాన్ ఖాన్ కత్రినా గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.  


కత్రినా కైఫ్ అందంతో పాటు పెరఫార్మన్స్ పరంగా కూడా మంచి నటి, ఈ సినిమాతో ఆమెకు నేషనల్ అవార్డు రావడం ఖాయం అని సల్మాన్ చెప్పాడు.  సల్మాన్ మాటలకు కత్రినా ఉబ్బితబ్బిపోయింది.  సల్మాన్ మాటలు నిజం కావాలని కోరుకుంటున్నట్టు కత్రినా చెప్పింది. కత్రినాకు సినిమాలో ఛాన్స్ ఇవ్వడమే కాకుండా ఇలా మంచి కంప్లీమెంట్ ఇవ్వడం విశేషం.  
మొదట భారత్ లో ప్రియాంక చోప్రాను హీరోయిన్ అనుకున్నారు.  కానీ, చివరి నిమిషంలో ప్రియాంక ఈ సినిమా నుంచి తప్పుకుంది.  అనేక మంది హీరోయిన్లను పరిశీలించినా చివరకు కత్రినాను ఓకే చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: