నా పేరు సూర్య సినిమా డిజాస్టర్ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ సినిమాని కన్ఫామ్ చేశారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. గతంలో అల్లు అర్జున్ కి 2 భారీ హిట్లు ఇచ్చిన త్రివిక్రమ్ ఈ సినిమాతో ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని మంచి కసిమీద వున్నారు. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ పక్కన మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా మరొక హీరోయిన్ ని ఇటీవల సినిమా యూనిట్ కన్ఫర్మ్ చేసినట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినబడుతున్నాయి.


ఈ సినిమాలో రెండు మహిళా ప్రధాన పాత్రలో ఉన్న గతంలో సోషల్ మీడియాలో అనేక వార్తలు రావడం జరిగాయి. ఈ క్రమంలో సెకండ్ హీరోయిన్ పాత్రలో ప్రణీత, అనుపమ పరమేశ్వరన్, ఈషా రెబబ్ వంటి హీరోయిన్లు నటిస్తున్నట్లు త్రివిక్రమ్ కన్ఫర్మ్ చేసినట్లు కూడా వార్తలు బయటకు రావడం జరిగాయి.


అయితే తాజాగా వినబడుతున్న వార్త ప్రకారం ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా కెమెరా శర్మ నీ కన్ఫామ్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాలో బొమన్ ఇరానీ మరియు టాబు కూడా నటిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్. హారిక హాసిని క్రియేషన్స్ మరియు గీత సంయుక్తంగా  నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానున్నట్టు సమాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: