‘మహర్షి’ సినిమా కలక్షన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి అన్న విషయం పక్కకు పెడితే ‘మహర్షి’ కోసం పనిచేసిన టీమ్ సభ్యులు అందరి పైనా ‘మహేష్ కు విపరీతమైన అభిమానం రోజురోజుకు పెరిగిపోతోంది. అభిమానుల దృష్టి ఎలా ఉన్నా ‘మహర్షి’ మహేష్ దృష్టిలో ఒక మైల్ స్టోన్ మూవీ. ఇలాంటి పరిస్థితులలో దేవిశ్రీప్రసాద్ పేరు చెపితే మండిపోతున్న మహేష్ అభిమానుల అభిప్రాయాలను పక్కకు పెట్టి ఎవరు ఊహించని విధంగా దేవిశ్రీకి ఎవరు ఊహించని విధంగా మరో అవకాసం ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది.

‘మహర్షి’ లోని పాటలు మహేష్ అభిమానులకు నచ్చకపోయినా మహేష్ కు మాత్రం బాగా నచ్చాయి. అందువల్లనే మహేష్ వచ్చేనెల నుండి మొదలు పెట్టబోతున్న అనీల్ రావిపూడి మూవీకి మహేష్ ఏరికోరి దేవిశ్రీని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి అనీల్ రావిపూడి ఈమూవీ మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ పేరును సూచించినా మహేష్ మాత్రం దేవిశ్రీకి ఓటు వేసినట్లు టాక్. 

దీనితో షాక్ అయిన అనీల్ రావిపూడి మహేష్ సూచనల మేరకు దేవిశ్రీ ప్రసాద్ ను కాంటాక్ట్ లోకి తీసుకుని ఈమూవీ కథ వివరించడమే కాకుండా తనకు ఎలాంటి ట్యూన్స్ కావాలి అన్న విషయమై దేవిశ్రీకి క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. అంతేకాదు ఈమూవీ ట్యూన్స్ విషయంలో ఏ మాత్రం అశ్రద్ద చేయవద్దని అనీల్ రావిపూడి దేవిశ్రీకి సున్నితంగా హెచ్చరించినట్లు గాసిప్పులు వస్తున్నాయి. 

ఇప్పుడు ఈవార్తలు వైరల్ కావడంతో మహేష్ అభిమానులు ఆశ్చర్యపడటమే కాకుండా మహేష్ పై కొంతమేరకు అసహనంలో ఉన్నట్లు కూడ తెలుస్తోంది. ‘మహర్షి’ సాధించలేని రికార్డు అనీల్ రావిపూడి మహేష్ ల మూవీ సాధిస్తుంది అని కలలు కంటున్న మహేష్ అభిమానులు జరుగుతున్న పరిణామాలు చూసి తమ హీరో దేవిశ్రీ మాయలో పడిపోయాడా అని కామెంట్స్ చేసుకుంటున్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: