ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి జిల్లాలోను ఫ్యాన్ గాలి విపరీతంగా వీచి వైఎస్ఆర్ కాంగ్రెస్ సునామీ సృష్టించిన నేపధ్యంలో సమంత చెప్పిన ఒక్క మాటతో గట్టెక్కిన తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి అదృష్టం ఇప్పుడు మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. ఇక వివరాలలోకి వెళితే గుంటూరు జిల్లాలోని రేపల్లె అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్థిగా అనగాని సత్యప్రసాద్ పోటీ చేసారు. 

ఈయన సమంత నిర్వహించే ప్రత్యూష ఫౌండేషన్ లో వైద్య సేవలు అందిస్తున్న ఒక డాక్టర్ సోదరుడు. అయితే ఈ కుటుంబంతో సమంతకు బాగా సాన్నిహిత్యం ఉండటంతో సత్యప్రసాద్ ను గెలిపించమని సమంత తన అభిమానులను ట్విటర్ ద్వారా కోరడమే కాకుండా అతడి విజయాన్ని కోరుకుంటూ రేపల్లె వచ్చి ప్రచారం కూడ చేసింది. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన హేమాహేమీలు అంతా ఓడిపోతే ఇప్పుడు ఈ ఎన్నికలలో ఈయన గెలవడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. దీనితో సమంత అభిమానులు ఆమె మాటకు రేపల్లె ఓటర్లు విలువ ఇచ్చారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ విజయం కోసం అనేక చోట్ల ప్రచారం చేసినా పడని ఓట్లు సమంత చెప్పిన ఒక్క మాటకు పడటం అత్యంత ఆసక్తిగా మారింది. దీనితో సమంతను ఒప్పించి తెలుగుదేశం పార్టీలో చేర్చుకుంటే నందమూరి హీరోలు చేయలేని పని సమంత చేయగలుగుతుంది అంటూ కొందరు షోషల్ మీడియాలో జోక్ చేస్తున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: