టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ మద్య కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అనే నేను’చిత్రం లో నటించారు. ఈ చిత్రం పూర్తిగా పొలిటికల్ డ్రామా..మహేష్ ఇందులో సీఎం గా నటించారు. మొన్న ఏపిలో వెలువడిన ఎన్నికల ఫలితాల్లో వైసీపీ భారీ మెజార్టీ సంపాదించింది. ఈ ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలకు 150 స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంది.
25 లోక్ సభ స్థానాలకు 23 వైసీపీ కైవసం చేసుకుంది. ఏపి ఎన్నికల ఫలితాలపై సినీ తారలు సోషల్ మీడియాలో తెగ పోస్ట్ లు పెడుతున్నారు. ఇక ఎన్నికల ఫలితాలపై స్టార్ హీరోలు తమ అభిప్రాయాలు ఇంకా సోషల్ మీడియా వేధికగా వెల్లడించలేదు అనుకుంటున్న సమయంలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలక్షన్స్ పై వరుస కామెంట్స్ చేశాడు.
ముందుగా మోడీ - వైఎస్ జగన్ లపై స్పందించాడు. ఆ తర్వాత తన బావ గల్లా జయ దేవ్ విజయంపై కూడా స్పందించాడు. వరుసగా సెకండ్ టైమ్ కూడా గుంటూరు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన గల్లా జయదేవ్ గారికి శుభాకాంక్షలు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు.