సినిమాల విషయంలో తడబాటు పడుతూ వరస పరాజయాలను మూట కట్టుకుంటున్న పూరి జగన్నాథ్ కు చాల రోజుల తరువాత ఆనందపడే సంఘటన జరిగింది. పూరి తమ్ముడు ఉమా శంకర్ గణేష్ వైఎస్ఆర్ పార్టీ తరపున నర్సీపట్నం నుండి ఎమ్.ఎల్.ఎ. గా పోటీచేసి గెలిచిన సందర్భంలో పూరి మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటన ఇప్పుడు అందర్నీ బాగా ఆకర్షిస్తోంది.

తాను జగన్ సాధించిన అద్భుత విజయాన్ని చూసి షాక్ అయ్యాను అంటూ ఆంధ్రప్రదేశ్ లోని ఇన్ని కోట్ల మంది ఓటర్లు సీక్రెట్ గా మీటింగ్ పెట్టుకుని కూడబలుక్కుని జగన్ కు ఓట్లు వేసారా అని తనకనిపిస్తోంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. అంతేకాదు ఒక వ్యక్తిని ఇన్ని కోట్లమంది నమ్మడం సాధారణమైన విషయం కాదు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నాడు పూరి. 

ఇదే సందర్భంలో పూరి మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు తరువాత జగన్ మీడియాతో మాట్లాడుతూ ఉన్న వీడియాను చూసినప్పుడు తనకు కలిగిన భావాలను షేర్ చేసాడు. జగన్ ముఖంలో విజయగర్వం కనిపించలేదు సరికదా నిరాడంబరతతో కూడిన ప్రశాంతత జగన్ ముఖంలో తనకు కనిపించిన విషయాన్ని షేర్ చేసాడు. 

తాను దేవుడును నమ్ముతానని అయితే ప్రజలు తలుచుకుంటే ‘దేవుడు నిర్ణయాలను’ కూడ మార్చగల శక్తి ప్రజలకు ఉంది అంటూ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం ప్రజలు జగన్ ను దేవుడుగా చూస్తున్నారు అంటూ జగన్ ఫోటో కనిపించినా వీడియో చూసినా ప్రజలు ఎగ్జైట్ అవుతున్న మ్యానియాను చూస్తుంటే తన దృష్టిలో ‘జగన్ లైన్ కింగ్’ అంటూ తాను తన కుటుంబం ఎప్పటికీ జగన్ కు రుణపడి ఉంటాము అంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ న్యూస్ గా మారింది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: