‘సాహో’ షూటింగ్ ముగింపు దశకు చేరుకోవడంతో ఈసినిమాకు సంబంధించిన కొన్ని ప్యాచ్ వర్క్ సీన్స్ ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సీన్స్ షూటింగ్ లో ప్రభాస్ శ్రద్ధా కపూర్ ల మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాలలో గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. 

ఒక సీన్ చిత్రీకరణ విషయంలో ప్రభాస్ ఒక టేక్ తోనే తన డైలాగ్ ను పూర్తి చేస్తే శ్రద్ధా కపూర్ పై ఐదు టేకులు తీసినా ఆమె ఎక్స్ ప్రెషన్స్ ఆసీన్ కు తగ్గట్టుగా రాకపోవడంతో ప్రభాస్ తన తదుపరి షాట్ గురించి చాల సేపు వేచి ఉండవలసిన పరిస్థితి ఏర్పడినట్లు టాక్. దీనితో డైలాగ్ పై శ్రద్ధ పెట్టమని ప్రభాస్ చేసిన సూచనకు శ్రద్ధా కపూర్ కు తీవ్ర అసహనం కలిగి ఆరోజు షూటింగ్ కు బ్రేకప్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. 

అయితే ఈవిషయమై ఈమూవీ యూనిట్ వర్గాలు వేరే విధంగా స్పందిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా మండిపోతున్న ఎండలకు శ్రద్ధా కపూర్ తట్టుకోలేక పోవడంతో ఆమె ఒక డైలాగ్ విషయంలో శ్రద్ధ కనపరచ లేకపోవడంతో ఈ సమస్యలు ఏర్పడ్డాయని లేకుంటే ప్రభాస్ శ్రద్ధా కపూర్ లు చాలామంచి స్నేహితులు అని వివరణ ఇచ్చినట్లు టాక్. 

గతంలో ఒకసారి శ్రద్ధా కపూర్ తనకు హైదరాబాద్ బిరియాని తినాలని ఉంది అంటే ప్రభాస్ తన ఇంటిలో రకరకాల బిర్యానీలు చేయించి శ్రద్ధాకు పంపిన విషయాన్ని స్వయంగా అప్పట్లో ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాంటి ఈ ప్రియ స్నేహితుల మధ్య ఇలా మండిపోతున్న భానుడు చిచ్చుపెట్టి ‘సాహో’ కి సమస్యగా మారాడు అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: