తెలుగు ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు హీరోగా ఎంట్రీ ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో నటించారు.  కానీ ఇప్పటి వరకు ఎదీ పెద్దగా సక్సెస్ సాధించిన చిత్రాలు లేవు.  కానీ హీరోగా తన ఇమేజ్ మాత్రం బాగానే కాపాడుకుంటూ వస్తున్నారు.  ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా ‘ఓటర్’చిత్రం రూపొందిన విషయం తెలిసిందే. ఈ చిత్రం టీజర్ ఆ మద్య ఎప్పుడో రిలీజ్ చేశారు. కానీ ఈ చిత్రం విడుదలపై ఎన్నో ఆటంకాలు వచ్చాయి.  ముఖ్యంగా డైరెక్టర్ కార్తీక్ , మంచు విష్ణు మద్య వచ్చిన వివాదం ఇందుకు కారణం అని వార్తలు వచ్చాయి. 


ఆ మద్య  దర్శకుడు కార్తిక్ కి, మంచు విష్ణుకి మధ్య వివాదం నడిచింది. మంచు విష్ణు తనను మానసికంగా వేధిస్తున్నాడని, చంపే అవకాశాలు కూడా ఉన్నాయని సంచలన కామెంట్స్ చేశారు. దాంతో వారి మద్య పెద్ద వివాదమే రాజుకుంది.  ఈ నేపథ్యంలో ఇక ఓటర్ చిత్రం ఇప్పట్లో రిలీజ్ కాదని డిసైడ్ చేసుకున్నారు.కానీ ఇప్పుడు రాజీ కుదుర్చుకొని సినిమాను విడుదల చేయడానికి సిద్ధపడినట్లు తెలుస్తోంది. 


తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొంది. యు/ఏ సర్టిఫికెట్ వచ్చినట్లు నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రం జూన్  లో రిలీజ్ చేయడానికి అంతా సిద్దం చేసుకుంటున్నారు.  అయితే ఈ మద్య ఓటర్ చిత్రంపై వస్తున్న రూమర్లు..ఆరపణల్లో ఏమాత్రం నిజం లేదని.. ఓటు విలువ, ఓటర్ విలువ గురించి చెప్పే  చిత్రమిది అంటూ చెప్పుకొచ్చారు. చక్కని సందేశంతో పాటు వినోదాన్ని కూడా పంచే చిత్రమంటూ వెల్లడించారు నిర్మాతలు.








మరింత సమాచారం తెలుసుకోండి: