సినిమాలతో పాపులర్ అయిన పృధ్వీ గత కొద్దికాలంగా తన సినిమాలకంటే ఎక్కువగా ప్రస్తుతం రాజకీయాల గురించి ఎక్కువగా పట్టించు కుంటున్నాడు. వైసీపి పార్టీ విజయం కోసం విపరీతంగా శ్రమించిన పృథ్వీ ఆపార్టీ జగన్ సారధ్యంలో సాధించిన ఘన విజయంతో విపరీతమైన జోష్ లో ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఈసంచలన నటుడు టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులను ఇరుకున పెడుతూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. 

ఏపీలో అధికారం మారిన వేళ టాలీవుడ్ పెద్దలు పట్టించుకోని వైనాన్ని ఏకిపారేస్తు కొందర్ని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ అత్యంత ఆశ్చర్యకరంగా మారాయి. ఈసందర్భంలో ఫృథ్వీకి వైసీపీ అభిమాని పెట్టిన పోస్టును తన వాట్సాప్ స్టేటస్ గా పెట్టాడు. అందులో చిరంజీవి అల్లు అరవింద్  రాఘవేంద్రరావు సురేష్ బాబులను ప్రస్తావిస్తూ వారు చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు ఎదురెళ్లి మరీ బొక్కేలు ఇచ్చి శుభాకాంక్షలు చెప్పిన వైనాన్ని గుర్తుకు చేస్తూ ఇప్పుడు జగన్ అధికారంలోకి వచ్చాక వారంతా ఏమైపోయారు అంటూ ఆ అభిమాని పెట్టిన పోస్ట్ ను పృథ్వీ లైక్ చేస్తూ తాను ఇలా చేస్తున్నందుకు తనకు సినిమాలలో అవకాశాలు రాకుండా ఇండస్ట్రీ పెద్దలు ప్రయత్నించినా తనకు ఎటువంటి అభ్యంతరం లేదు అంటూ కామెంట్స్ చేసాడు. 

అంతేకాదు ఇండస్ట్రీ పెద్దలు జగన్ కు అభినందనలు తెలపకపోయినా ఆయనకు వచ్చే నష్టం లేదనీ జగన్ ఆద్వర్యంలో ఫిలిం ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ లో బాగా అభివృద్ధి చెందుతుంది అన్న నమ్మకం తనకు ఉంది అంటూ పృధ్వీ కామెంట్స్ చేసాడు. తాను తీసే సినిమాలలో హీరోయిన్స్ బొడ్డు మీద పండ్లు వేసే రాఘవేంద్రరావుకు కూడా జగన్ గెలుపు కనిపించలేదా అంటూ పృథ్వీ ప్రశ్నిస్తున్నాడు. 

అదేవిధంగా చిరంజీవి అల్లు అరవింద్  సురేష్ బాబు లాంటి ఇండస్ట్రీ పెద్దలకు జగన్ గెలుపుకు సంబంధించిన వార్తలు వినిపించడం లేదా అంటూ పృథ్వీ ప్రశ్నలు కూడ వేస్తున్నాడు. తాను వైసీపీ తరుఫున క్యాంపెయిన్ చేస్తున్న సమయంలో తనను కొందరు బెదిరించిన విషయాలను వివరిస్తూ తాను సినిమాల్లో ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి లేనని షాకింగ్ కామెంట్స్ చేసాడు. పృథ్వీ మాటలకు ఎంతవరకు ఇండస్ట్రీ పెద్దలు స్పందిస్తారో చూడాలి..   



మరింత సమాచారం తెలుసుకోండి: