సాధారణంగా హీరోయిన్స్ తమ గ్లామర్ ఎక్స్ పోజ్ చేస్తూ ఫోటో షూట్స్ ఇవ్వడంతో పాటు వారి విహార యాత్రలకు సంబంధించి ఆ ప్రదేశంలో తాము తీసుకున్న సేల్ఫీలను పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే కీర్తీ సురేశ్ లేటెస్ట్ గా షేర్ చేసిన సెల్ఫీ ఆమె అభిమానులకు మాత్రమే కాకుండా సాధారణ సినీ అభిమానులకు కూడ ఆమెకు ఏమైంది అంటూ ప్రశ్నలు అడిగేలా పరిస్థుతులు ఏర్పడుతున్నాయి. 

‘మహానటి’ సావిత్రిగా అద్భుతంగా అభినయించడమే కాకుండా సాంప్రదాయ చీరకట్టులో ఆమెను చూసిన ప్రేక్షకులు ఆమె పై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఈ ఒక్క సినిమాతోనే ఆమెకు అనేక ప్రశంసలతో పాటు అనేక అవార్డులు కూడ వచ్చాయి. 

అలాంటి కీర్తి సురేశ్ షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోను చూసిన వారు చాలామంది షాక్ అవుతున్నారు. ఆమె చాల చిక్కిపోయి కళావిహీనంగా కనిపిస్తున్న ఈ ఫోటోను ఆమె ఇలా షేర్ చేయడంలో ఆమె సింపుల్ సిటీ అనుకోవాలా ? లేదంటే ఆమెకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఏర్పడ్డాయా అన్న సందేహాలు కలుగుతున్నాయి. 

ప్రస్తుతం ఈ ఫోటో షోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘నతింగ్ లైక్ మోర్నింగ్ వర్కవుట్స్’ అంటూ సింపుల్ క్యాప్షన్ ఇచ్చి కీర్తి ఈ ఫోటోను షేర్ చేసింది దీనితో అభిమానులు కొంతవరకు తెరిపిన పడ్డారు. ప్రస్తుతం ఈమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో చాల ఆఫర్స్ వస్తున్నా కేవలం తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు మాత్రమే నటిస్తాను అని కీర్తి సురేశ్ చెపుతున్న నేపధ్యంలో ఆమె నుండి సినిమాలు రావడం తక్కువగా ఉంటోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: