ముకుంద కాంబినేషన్ మరోసారి రిపీట్ అవ్వబోతుంది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి అనే కొత్త సినిమా వరుణ్ తేజ్ పూజా హెగ్డే కాంబినేషన్లో మొదలు కాబోతుంది. తమిళ సినిమా జిగర్ తాండా సినిమాకు ఈ సినిమా రీమేక్. తమిళంలో హిట్టైన ఈ సినిమా కథకు తెలుగు నేటివిటీకి అనుగుణంగా చాలా మార్పులు చేసారు డైరెక్టర్ హరీష్ శంకర్.

ఎఫ్ 2 హిట్టుతో వరుణ్ తేజ్ తన కెరీర్లో భారీ హిట్టు కొట్టాడు . ఫిదా, ఎఫ్ 2 రెండు సినిమాలతో 50 కోట్ల క్లబ్బులో చేరాడు వరుణ్ తేజ్. పూజా హెగ్డే కూడా నెంబర్ 1 స్థానంలో ఉండటంతో ఈ కాంబినేషన్ కు విపరీతమైన క్రేజ్ ఉంది.పూజా నటించిన అరవింద సమేత, మహర్షి సినిమాలు హిట్టు కావడంతో పూజా గోల్డెన్ లెగ్ గా మారింది.

దువ్వాడ జగన్నాథం తరువాత హరీశ్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. 14 రీల్స్ బ్యానర్ పై ఈ సినిమాను ఆచంట రాము, ఆచంట గోపీనాథ్ నిర్మించబోతున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా గ్యాంగ్ స్టర్ కామెడీతో రూపొందుతుంది


మరింత సమాచారం తెలుసుకోండి: