రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చేస్తున్నాడు.  ఎన్టీఆర్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతున్నది.  ప్రీ ఇంటర్వెల్ కు ముందు వచ్చే సీన్స్ అవి.  రాజమౌళి సినిమా కాబట్టి గుండెలపై చేయి వేసుకొని హ్యాపీగా ఉండొచ్చు.  ఫలితం తప్పకుండా వస్తుంది.  ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా ఇందులో హీరోగా చేస్తున్నారు.

ఇది జులై 30, 2020 లో రిలీజ్ కాబోతున్నది. డేట్ ఎప్పుడో కన్ఫర్మ్ అయ్యింది కాబట్టి రిలీజ్ ఫిక్స్ అయ్యినట్టే.  సందేహం అవసరం లేదు.  ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ ఏ సినిమా చేయబోతున్నారు అనే విషయంపై అనేక కథనాలు వినిపిస్తున్నాయి.  ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా మైత్రి మూవీ మేకర్స్ లో ఉంటుందని, ఎన్టీఆర్ హీరో అని అంటున్నారు.  


బ్యానర్ దొరికింది.. హీరో దొరికారు.  మరి కథ.. దర్శకుడు ఎవరు అనే దానికి మొన్నటితో ఓ క్లారిటీ వచ్చింది.  కేజేఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ శుభాకాంక్షలు చెప్తూ ఫోటోను రిలీజ్ చేసింది. అంటే ప్రశాంత్ నీల్ నెక్స్ట్ సినిమా మైత్రి మూవీ మేకర్స్ తో చేస్తున్నారు.  బాగుంది. 


అంటే ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ప్రశాంత్ నీల్ అన్నమాట.  ప్రశాంత్ తో సినిమా అంటే మరో కేజీఎఫ్ ను ఊహించుకోవచ్చు. అంతకు మించేలా సినిమా ఉండొచ్చు.  మరి ప్రశాంత్ నీల్ తో సినిమా అంటే ఎన్టీఆర్ ఒప్పుకుంటాడా... చూద్దాం.  



మరింత సమాచారం తెలుసుకోండి: