బాలీవుడ్ నటి సౌందర్యశర్మ ఇంట్లో ఓ వానరం చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సాధారణంగా వానర చేష్టలు చూస్తుంటే నవ్వొస్తుంది..అదే సమయంలో భయం కూడా వేస్తుంది. ఇక ఆ వానరాలు ఇంట్లోకి వస్తే..అవి చేసే హంగామా అంతా ఇంతా ఉండదు.
తాజాగా బాలీవుడ్ నటి సౌందర్యశర్మ ఓ వానరం ప్రవేశించి నానా రచ్చ చేసింది..డైనింగ్ టేబుల్ పై ఉన్న తినుబండారాలను స్వాహా చేసి, మెల్లగా ఆమె బెడ్ రూం లోనికి ప్రవేశించి అక్కడ పడుకుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఆమె ఇంటి సభ్యులు ఆ వానరం చేస్తున్న అల్లరి తమ కెమెరాలో బంధించారు.
తాజాగా ఆ వానర చేష్టలకు సంబంధించిన వీడియోను సౌందర్యశర్మ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేశారు.కాగా బాలీవుడ్ నటి సౌందర్యశర్మ 2017లో వచ్చిన ‘రాంచీ డైరీస్’ సినిమాలో నటించారు. ప్రస్తుతం సౌందర్య శర్మ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.