చిత్రలహరి సినిమాతో సాయిధరమ్ తేజ మంచి స్వింగ్ లో ఉన్నాడు.  నెక్స్ట్ సినిమా మారుతితో కమిట్ అయ్యాడు.  ఈ సినిమాను సంక్రాంతికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు మారుతి.  ఎలాగో బ్యాక్ గ్రౌండ్ లో ఉన్నది గీత ఆర్ట్స్ కాబట్టి, సినిమాకు ఎలాంటి లోటు ఉన్నాడు.  కథ అంటా రెడీ.. 


కాకపోతే ఇక్కడ ఒక చిక్కు వచ్చింది.  ఈ సినిమాలో సాయి ధరమ్ తో రొమాన్స్ చేసే హీరోయిన్లు ఎవరు.. ఇద్దరి పేర్లు తెరపైకి వచ్చాయి.  అందులో ఒకరు నిధి అగర్వాల్.  సవ్యసాచి, మిస్టర్ మజ్ను చేసింది.  ఇప్పుడు పూరితో ఇస్మార్ట్ శంకర్ చేస్తోంది.  


రెండో పేరు రుక్సార్.  ఎబిసిడి హీరోయిన్.  ఆల్రెడీ మెగా కాంపౌండ్ హీరో అల్లు శిరీష్ తో సినిమా చేసింది.  మెగా కాంపౌండ్ హీరోయిన్ కాబట్టి ఆమెకు అవకాశం ఉండొచ్చు.  ఈ సినిమా  త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళబోతున్నది.  సినిమా ఎలా ఉంటుంది అన్నది తెలియాలి.  


ఆరు వరస ప్లాప్ ల తరువాత సాయి ధరమ్ తేజ్ హిట్ కొట్టాడు.  ఈ హిట్ తర్వాత చేయబోయే సినిమాలు కూడా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు.  అందుకే సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా కోసం ప్రయత్నం చేస్తున్నాడు.  మరి చూద్దాం సాయి హిట్ హిట్ కొడతాడా లేదా అన్నది.  


మరింత సమాచారం తెలుసుకోండి: