యువ దర్శకుడు శ్రీ హర్ష కోనుగంటి యూత్ ను టార్గెట్ చేసుకుని తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'హుషారు' బీసీ సెంటర్లలో మంచి రెస్పాన్స్ తో బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లను రాబట్టి మొత్తానికి హిట్ సినిమాగా నిలిచింది. దాంతో ఈ యంగ్ డైరెక్టర్ కి బాగానే అవకాశాలు వచ్చాయి. వాటిల్లో ముఖ్యంగా యూత్ లో మంచి క్రేజ్ ఉన్న సెన్సేషనల్ హీరో 'విజయ్ దేవరకొండ'తో సినిమా చేసే అవకాశాన్ని అందుకోవడం. అయితే మొదట శ్రీ హర్ష చెప్పిన కథ విజయ్ కి నచ్చలేదు. దాంతో ఈ సినిమా ఇప్పట్లో ఉండదని.. పైగా సినిమా ఆగిపోయిందని కూడా ఆ మధ్య వార్తలు వచ్చాయి.
కాగా తాజాగా శ్రీ హర్ష, విజయ్ దేవరకొండకి తన కొత్త కథను వినిపించాడట. కథ విజయ్ కి బాగా నచ్చిందని తెలుస్తోంది. వెంటనే విజయ్ దేవరకొండ సినిమా చెయ్యడానికి అంగీకరించాడట.
మొత్తానికి తన రెండో చిత్రాన్నే ప్రస్తుతం ఫామ్ లో ఉన్న హీరోతో చెయ్యడం.. అది 20 కోట్లుగా పైగా బడ్జెక్ట్ ఉన్న సినిమాకి డైరెక్షన్ చేసే ఛాన్స్ రావడం, నిజంగా శ్రీ హర్షకి ఇది బంపర్ ఆఫరే.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ చిత్రంతో, అదేవిధంగా దర్శకుడు క్రాంతి మాధవ్ సినిమాతో బిజీ బిజీగా వున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక శ్రీ హర్ష కోనుగంటి సినిమా మొదలవుతుందట.