ఈరోజు ప్రారంభం అయిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో పండగ వాతావరణం కనిపించింది. అధికారం కోసం ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శలు చేసుకుంటూ జనం మధ్య తిరిగిన రాజకీయ నాయకులు ఇప్పుడు ఎమ్.ఎల్.ఏ. లుగా మారి అసెంబ్లీలో ప్రమాణస్వీకారాలు చేసారు.

అయితే ఈరోజు తమ మధ్య ఉన్న వైరం మరిచిపోయి ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ వైసీపి తెలుగుదేశం ఎమ్.ఎల్.ఏ. లు గడిపిన తీరు మీడియా కెమెరాలకు మంచి హాట్ న్యూస్ గా మారింది. ముఖ్యంగా ఈరోజు నందమూరి సింహం బాలకృష్ణ వైసీపీ ఎమ్.ఎల్.ఏ.లు మంత్రులతో జోక్స్ వేస్తూ కలివిడిగా వారు కూర్చున్న సీట్స్ వైపు వెళ్ళడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. 

ముఖ్యంగా బాలయ్య డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా ఎమ్మెల్యే జోగి రమేష్‌ మంత్రి కోడాలి నాని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లును బాలకృష్ణ నవ్వుతూ పలకరించడమే కాకుండా వారందరితో కరచాలనం చేస్తూ జోక్స్ వేస్తూ చాలాసేపు వారి మధ్య ఉండటం షాకింగ్ న్యూస్ గా మారింది. అంతేకాదు లంచ్ టేబుల్స్ వద్ద కూడ టిడిపి వైఎస్ఆర్ ఎమ్.ఎల్.ఏ. లు ఒకరి పై ఒకరు ప్రేమకురిపించుకుంటూ పలకరించుకున్నారు.

అయితే చంద్రబాబునాయుడు మాత్రం గంభీరంగానే తన సీట్లో కూర్చుండిపోయారు. ఈరోజు బాలయ్య చేసిన హడావిడిని గమనించిన వారు భవిష్యత్ లో వైసీపీ తో తెలుగుదేశం చేయబోయే రాయబారాలకు దూతగా బాలకృష్ణ మారుతాడా అంటూ మరికొందరు జోక్ చేసుకున్నట్లు టాక్. టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి పార్టీలు వేరైనా అటు బాలయ్య ఇటు రోజాలు ఈరోజు మీడియా కెమెరాలకు బాగా ఆకర్షించారు..  



మరింత సమాచారం తెలుసుకోండి: