ప్రసిద్ధ కొరియోగ్రాఫర్ రాజు సుందరం మొదటిసారిగా దర్శకత్వం వహించిన తమిళ చిత్రం " ఏగన్" ఇందులో అజిత్, నయనతార ముఖ్య పాత్రలుగా పోషించారు. పదకొండు సంవత్సరాల తర్వాత మరోసారి దర్శకుడిగా మారబోతున్నాడు.

ఈసారి తెలుగులో సినిమా తీస్తున్నాడు.  రొమాంటిక్ కామెడి జానర్ లో తీసే ఈ చిత్రంలో శర్వానంద్ హీరోగా నటిస్తున్నట్టు సమాచారం. 4k ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నారు. శర్వానంద్ కి ఈ సినిమా కథ బాగా నచ్చిందట.

ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాదిలో స్టార్ట్ అవుతుందట. శర్వానంద్ ఇప్పటికే తమిళ చిత్రం అయిన 96 తెలుగు రీమేక్ లో నటిస్తున్నాడు.  దీనికి సి ప్రేమ్ కుమార్ దర్శకుడు.  దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. గత ఏడాది ఈ సినిమా తమిళంలో భారీ విజయం సాదించింది.

ఈ సినిమా ప్రాసెస్ లో ఉండగానే శర్వానంద్ మరో తమిళ సినిమాని ఒప్పుకున్నాడు. ఈ సినిమాకి నిర్మాతగా ఎస్ ఆర్ ప్రభు వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాతో కొత్త దర్శకుడిని పరిచయం చేయబోతున్నారట.  నటీనటులు ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: