తెలుగు ఇండస్ట్రీలో కింగ్ నాగార్జున గా పేరు తెచ్చుకున్నాడు.  మొదటి నుంచి రొమాంటిక్ పాత్రల్లో కనిపించిన నాగార్జున అప్పుడప్పుడు యాక్షన్ చిత్రాల్లో నటించి మెప్పిస్తున్నారు.  ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో నాగార్జున ఇద్దరు తనయుడు నాగ చైతన్య, అఖిల్ అక్కినేని హీరోలుగా రాణిస్తున్నారు.  సాధారణంగా తమ వారసులు హీరోలుగా వస్తున్న తరుణంలో తండ్రులు వారికి తగ్గ పాత్రల్లో నటిస్తుంటారు. కానీ నాగార్జున మాత్రం ఇప్పటికీ నవ మన్మధుడిగానే ఉంటారు...అందుకే ఆయనకు నచ్చిన పాత్రలే ఎంచుకుంటున్నారు.  ఆ మద్య సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో రొమంటిక్ హీరోగా దుమ్మురేపాడు. 


ఆ తర్వాత వచ్చిన ఆఫీసర్, దేవదాసు చిత్రాల్లో యాక్షన్ హీరోగా కనిపించాడు.  తాజాగా మరోసారి టాలీవుడ్ మన్మధుడు రెచ్చిపోయాడు. అప్పట్లో త్రివిక్రమ్ రచయితగా విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘మన్మధుడు’ఆయన కెరీర్ లో సూపర్ హిట్ చిత్రం.   తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘మన్మధుడు2’ రూపొందుతుంది.  ఈ చిత్రానికి రాహూల్ రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు.  ఈ చిత్రంలో నాగార్జున సరసన నాయికలుగా రకుల్ - కీర్తి సురేశ్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయ్యింది. 

ఇక టీజర్ విషయానికి వస్తే..నాగార్జున ఓ వైపు నవ్విస్తూనే..లిప్ లాక్ సీన్లో రెచ్చిపోయారు.  వయసు ముదిరిపోతున్నా నాగ్ కి ఇంకా పెళ్లి కాకపోవడం గురించిన ఫన్నీ సన్నివేశాలపైనే ఫోకస్ చేస్తూ కట్ చేసిన ఈ టీజర్ ఆకట్టుకునేలా వుంది. 'ఈ వయసులో మీకు పెళ్లేంటి సార్ .. ఎండిపోయిన చెట్టుకి నీళ్లు పోస్తే మళ్లీ పూలు పూస్తాయా?' అనే డైలాగ్ ఫన్నీ డైలాగ్ తో ఈ చిత్రంలో నాగ్  బ్రహ్మచారి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.   ఆగస్టు 9వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: