విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికలలో బెంగళూరు నగరం నుండి పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయిన ప్రకాష్ రాజ్ తన జీవితంలో జరిగిన ఓ సంఘటన గురించి నెటిజన్లతో పంచుకున్నారు. అదేమిటంటే గుల్మార్గ్ లోని ఓ హోటల్ దగ్గర మహిళా అభిమాని తనతో ఫోటో దిగాలని తన కూతురుతో కలిసి సెల్ఫీ అడిగిన క్రమంలో దానికి ఒప్పుకుని సదరు మహిళ తో పాటు తన చిన్న కూతురితో కలిసి సెల్ఫీ దిగడం జరిగింది.


దాంతో ఆ తల్లి కూతురు ఎంతగానో సంతోషపడ్డారు ఈలోపల ఒక్కసారిగా ఆమె భర్త సదరు మహిళా దగ్గరికి వచ్చి వెంటనే సెల్ఫీ డిలీట్ చేయాలని నానా రాద్ధాంతం చేశారు. అయితే సెల్ఫీ డిలీట్ చేయడానికి గల కారణం గతంలో మోడీకి వ్యతిరేకంగా మాట్లాడినందుకు తన తో ఫోటో దిగిన మహిళను ఆమె భర్త విమర్శించారని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు.


అయితే అదే సమయంలో ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం తో వెంటనే ఆమె భర్త దగ్గరికి వెళ్లి పక్కకు పిలిచి  ''సర్‌.. నీ భార్య నిన్ను పెళ్లి చేసుకుని, అందమైన కుమార్తెను నీకిచ్చి, జీవితాన్ని పంచుకోవడానికి.. నేను, మోదీ కారణం కాదు.వారు మీ అభిప్రాయాల్ని గౌరవిస్తున్నప్పుడు.. మీరూ అలానే వారినీ గౌరవించండి'' అని చెబితే కనీసం సమాధానం కూడా చెప్పకుండా ఆ వ్యక్తి నుంచున్నారని బాధతో అక్కడ నుండి వచ్చేసినట్లు ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చాడు. అయితే సదరు భర్త తన కోసం తన భార్యాబిడ్డల మనసు లను గాయపరచడం చాలా దారుణమైన విషయం అని సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు ప్రకాష్ రాజ్.



మరింత సమాచారం తెలుసుకోండి: