తెలుగుదేశం పార్టీ ఓటమి గురించి చంద్రబాబు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ ఓటమి గురించి లోతైన చర్చలు చేపట్టిన నేపధ్యంలో ఒకనాటి హీరో ఈనాటి క్యారెక్టర్ యాక్టర్ సుమన్ తెలుగుదేశం ఓటమి పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. ప్రస్తుతం గోదావరి జిల్లాలలో ఒక షూటింగ్ నిమిత్తం ఆ ప్రాంతానికి వెళ్ళిన సుమన్ తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఈ కామెంట్స్ చేసాడు.

ఏపీలో టీడీపీ ఘోర ఓటమికి ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యకారణం అని ఈవిషయంలో తెలుగుదేశం పవన్ ను తక్కువ అంచనావేసి ఘోరంగా నష్టపోయింది అంటూ కామెంట్స్ చేసాడు. అంతేకాదు పవన్ ఓటమిలో విజయం సాధించాడని అంటూ పవన్ తెలుగుదేశం అధినాయకత్వం అవినీతి పై చేసిన కామెంట్స్ జనం మధ్యకు చాల సులువుగా వెళ్లిపోయి ఆ కామెంట్స్ వైరల్ గా మారిన విషయాన్ని సుమన్ వెల్లడించాడు.

ఎన్నికల ముందు పవన్ రాజకీయ భవిష్యత్ ఏమిటో తనకు అర్ధం కావడం లేదు అంటూ కామెంట్స్ చేసిన సుమన్ ఇప్పుడు ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ ఓటమికి ప్రధాన కారణం పవన్ మాత్రమే అంటూ చేసిన కామెంట్స్ ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. అంతేకాదు సుమన్ మాట్లాడుతూ పవన్ వల్ల తెలుగుదేశం పార్టీ తమ నెగిటివ్ ఓటు చీలిపోతుంది అని భావిస్తే పవన్ ‘జనసేన’ తెలుగుదేశం పాజిటివ్ ఓటుకు గండికొట్టింది అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చలకు దారితీస్తున్నాయి. 

ఇదే సందర్భంలో సుమన్ జగన్ అద్భుత విజయం గురించి మాట్లాడుతూ తనకు ఊహ వచ్చినప్పటి నుంచి జరిగిన ఎన్నికలలో జగన్ కు వచ్చినటువంటి పాజిటివ్ మ్యానియా తాను ఏఎన్నికలలోనూ చూడలేదనీ జగన్ కు ఓటర్లు పట్టిన బ్రహ్మరధం చరిత్రలో నిలిచిపోతుంది అంటూ కామెంట్స్ చేసాడు. ఫిలిం ఇండస్ట్రీని హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ కు తరలించడంలో కూడ జగన్ చరిత్ర సృష్టించాలి అని కోరుకుంటూ సుమన్ పవన్ ఓటమిలో గెలుపును విశ్లేషించినతీరు ప్రస్తుతం నైరాశ్యంలో ఉన్న జనసైనికులకు మంచి జోష్...  


మరింత సమాచారం తెలుసుకోండి: