కోలీవుడ్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ మొదటి సినిమాతో వండర్  అద్భుతాలు చేసేలా ఉన్నాడు. అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్యా వర్మ టీజర్ ను ఇటీవల రిలీజ్ చేసి ఆడియెన్స్ ని తెగ ఎట్రాక్ట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల కాకముందే ధృవ్ తండ్రి మాట వినకుండా నడుచుకున్నట్లు టాక్ వచ్చింది... ఆ వివరాల్లోకి వెళితే....

 

బేసిగ్గా మనోడు కథల ఎంపిక విషయంలో ధృవ్ దూకుడుగా వ్యవహరిస్తున్నట్లు కోలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఎవరికీ చెప్పకుండా నాన్న సినిమా దర్శకుడు ఏఎల్.విజయ్ చెప్పిన కథను ధృవ్ ఒకే చేసి సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు వ్యవహరించాడని టాక్ రాగా ఈ విషయంపై విక్రమ్ మేనేజర్ అలాంటిదేమి లేదని, అనవసరంగా ఎక్కువ ఆలోచించొద్దని క్లారిటీ ఇచ్చారు.

 

రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని చెప్పి, ధృవ్ ప్రస్తుతం తన ద్రుష్టి మొత్తం మొదటి సినిమా ఆదిత్య వర్మ పైనే తన దృష్టిని కేంద్రీకించినట్లు చెప్పారు. అదే విధంగా అధికారికంగా తాము చెప్పేంత వరకు ఏ విధమైన రూమర్స్ ని అభిమానులు నమ్మవద్దని, అలాగే మీడియా కూడా ఏదైనా అనుమానం ఉంటే తమని సంప్రదించవచ్చని క్లారిటీ ఇచ్చారు.

 

అయితే గతంలో ధృవ్ అండ్ బాల టీం రిలీజ్ చేసిన "వర్మ" టీజర్ అండ్ ట్రైలర్ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టలేకపోయిన విషయం మనకు విదితమే.  మొత్తం ఫుటేజీని నిర్మాతలు డస్ట్ బిన్ లో పడేసి, మరల రీమేక్ చేసారు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మన "అర్జున్ రెడ్డి" మాదిరి జస్ట్ కాపీ అండ్ పేస్ట్ చేసేసారు. అంతేమరి, అర్జున్ రెడ్డా.. మజాకా ..


మరింత సమాచారం తెలుసుకోండి: