నటిగా కెరీర్‌ను ప్రారంభించకముందు చాలా కష్టాలు ఎదుర్కొన్నానని సినీ నటి సమంత అన్నారు. ఓ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన సామ్‌ నేడు టాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా రాణిస్తున్నారు. ఈ ప్రయాణంలో ఎన్నో నేర్చుకున్నానని సామ్‌ తాజాగా చెప్పారు. ఈ మేరకు ఆమె ట్విటర్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. జులై 5న విడుదల కాబోతున్న తన తర్వాతి సినిమా ‘ఓ బేబీ’ గురించీ ముచ్చటించారు.

 

నా కంటే బాగా కష్టపడే అమ్మాయిలు చాలా మందే ఉన్నారు. నాకు తెలిసి నేను ఎంచుకుంటున్న స్క్రిప్ట్‌ వల్ల ఈ విజయం సాధ్యం అవుతోందేమో. చిత్ర పరిశ్రమకు ఒంటరిగా వచ్చా. నా తప్పుల నుంచి ఎన్నో నేర్చుకున్నా. గత రెండేళ్లుగా ఇంకా జాగ్రత్తగా సినిమాలు ఎంచుకుంటున్నా. దాని ఫలితమే ఇది. ఎల్లప్పుడూ నా అభిమానులను నిరాశపరచకూడదనే కధల పట్ల చాల కేర్ గా వుంటాను.

 

విమర్శలు నన్ను తొలుత చాలా బాధించేవి. ఉదయం నిద్రలేచి కామెంట్స్‌ చూసేదాన్ని. అవి నన్ను మానసికంగా చాలా బాధపెట్టేవి. మెంటల్‌గా స్థిరంగా ఉండలేకపోయేదాన్ని. అప్పుడు నాకు మరొకరి సలహాలు తీసుకోవడం ఇష్టం ఉండేది కాదు. ఓ అంశంపై వివరణ ఇవ్వడం అవసరం అనిపించేది. కానీ ఇప్పుడు నేను మారిపోయా.

 

నా భర్త చైతన్య చాలా ఏకాగ్రతగా ఉంటున్నారు. బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. నేను నా తొలి సినిమా సమయంలో ఏం పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అన్నీ పర్‌ఫెక్ట్‌గా ఉండాలి అని తపన పడుతున్నా. ఇప్పుడు చైతన్యలో నాకు బాధ్యతగల నటుడు కనిపిస్తున్నాడు. హి ఈజ్ గ్రేట్ నౌ అని అమ్మడు తన భర్త గురించి గొప్పలు పోతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: