బాలీవుడ్ ఎన్ని సినిమాలు చేసినా.. టాలీవుడ్ లో ఒక్క సినిమా చేస్తే చాలు ఆటోమాటిక్ గా టాప్ లిస్ట్ లోకి వెళ్లిపోవచ్చు.  ఈ సంగతి బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి వచ్చి ఇక్కడ ఇక్కడ హిట్స్ కొట్టి బాలీవుడ్ లో చక్రం తిప్పుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు.  వాళ్లకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా ఎక్కువే.  అందుకు ఒక ఉదాహరణ కత్రినా కైఫ్, కృతి సనన్.  


కృతి సనన్ బాలీవుడ్ లో చిన్న చిన్న సినిమాలు చేస్తున్న సమయంలో ఆమెకు టాలీవుడ్ లో మహేష్ బాబు 1 నేనొక్కడినే సినిమా చేసే అవకాశం వచ్చింది.  మరోమాట మాట్లాడకుండా ఈ అమ్మడు ఒకే చేసింది.  సుకుమార్ దర్శకుడు.  ఇంకేముంది సినిమా సూపర్ గా అనుకున్నారు.  కథనాలు బాగున్నా.. ఆ తరహా సినిమాను అప్పట్లో రిసీవ్ చేసుకోలేకపోయారు.  


తరువాత నాగచైతన్యతో దోచేయ్ చేసినా.. టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రం మనసులు దోచుకోలేవు అని చెప్పెయ్యడంతో.. టాలీవుడ్ నుంచి తిరిగి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది.  అలా వెళ్లిన ఈ అమ్మడు.. అక్కడే టాప్ హీరోయిన్ గా ఎదిగింది.  ఒక వే అంటూ క్రియేట్ అయ్యాక.. ఆ మార్గంలో వెళ్లడం పెద్ద విషయం ఏమీకాదు.  రూట్ వేసుకోవడానికి సోషల్ మీడియా బాగా ఉపయోగపడుతున్నది.  కృతి విషయంలో కూడా అదే జరిగింది.  


బాలీవుడ్ నటి కృతి సనన్ ఇంస్టాగ్రామ్ లో దూసుకుపోతున్నది.  సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫొటోలతో అదరగొట్టే ఈ హీరోయిన్ ను ఇంస్టాగ్రామ్లో 22 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు.  22 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారని చెప్తూ బీజ్ ఒడ్డున ఇసుకపై 22 అని రాసి, దాని మధ్యలో కృతి బ్లాక్ కలర్ బికినీలో ఫోజులు ఇచ్చింది.  ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: