తెలుగు సినిమాలో ఒక గేమ్ ఛేంజర్ గా నిలిచిన అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది షాలినీ పాండే. ఆమె పేరు కంటే " ప్రీతి" పేరు చెప్తేనే ఎవరైనా గుర్తు పడతారు. ఆ సినిమా తర్వాత మహానటి లో కనిపించినప్పటికీ అది చిన్న పాత్ర కావడంతో పెద్దగా పేరు రాలేదు. . మొన్న  కళ్యాణ్ రామ్ తో  వచ్చిన 118 సినిమాలో హీరోయిన్ గా కనిపించింది.

 

ఆ తర్వాత తన నెక్స్ట్ సినిమా ఏంటనేది ఇంతవరకు తెలిసి రాలేదు. ఇప్పుడు ఆ విషయం పై తాజా గా ఒక వార్త బయటకు వచ్చింది.ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ కుమార్తె స్వప్నదత్.. స్వప్న సినిమా బ్యానర్ పై ఓ సినిమా తీయడానికి సిద్ధమవుతోంది. 'పిట్టగోడ' ఫేమ్ దర్శకుడు అనుదీప్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడని సమాచారం.

 

కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలతో పాటు నవీన్ పోలిశెట్టి ఈ సినిమాలో హీరోలుగా కనిపించనున్నారు. ఇందులో హీరోయిన్ గా షాలిని పాండేని తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందట. దీంతో కాస్త ఫేం ఉన్న హీరోయిన్ ని తీసుకోవాలని భావించారు.ఆ పాత్రకు షాలిని పాండే సూట్ అవుతుందని భావించి ఆమెని ఫైనల్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

 

పాత్ర ప్రకారం సినిమాలో షాలిని ఓ న్యాయవాదిగా కనిపించనుండి. సినిమా స్క్రిప్ట్ పనులు కూడా పూర్తయ్యాయి.త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. దర్శకుడు అనుదీప్ చెప్పిన కథపై నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్తున్నారు. 'మహానటి' వంటి భారీ సినిమా రూపొందించిన  తరువాత స్వప్న సినిమా బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: