తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్ యాంకర్ గా అతి తక్కువ సమయంలో విపరీతమైన క్రేజ్ సంపాదించింది రష్మీ గౌతమ్.  మొదట జబర్ధస్త్  కార్యక్రమానికి అనసూయ యంకర్ గా వచ్చినా..తర్వాత ఆమె స్థానంలోకి రష్మి వెళ్లింది.  ప్రస్తుతం వీరిద్దరు జబర్ధస్త్ కామెడీ షోలో కొనసాగుతున్నారు.  అయితే రష్మీ గౌతమ్ వెండి తెరపై కూడా తన సత్తా చాటాలని ప్రయత్నం చేసినా పెద్దగా వర్క్ ఔట్ కాలేదు. ప్రతిసారి రష్మి సోషల్ మీడియాలో మాత్రం తన కాంట్రవర్సీ మాటలతో హల్ చల్ చేస్తుంది. 


అమ్మాయిలు డ్రెస్సింగ్ స్టైల్ పై ఏమైనా కామెంట్స్ చేసినా..డేటింగ్ పై కామెంట్ చేసినా ఫ్యాన్స్ కి వాటికి తగ్గ సమాధానాలు చెబుతుంది.  తాజాగా వరంగల్ హన్మకొండలో తొమ్మిది నెలల చిన్నపాపను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన గురించి తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దుర్మార్గుడిని ప్రజల సమక్షంలో అతి దారుణంగా ఉరితీసి చంపాలని ప్రజలు కోరుకుంటున్నారు.  తాజగా యాంకర్ రష్మి కూడా ఈ విషయంపై స్పందించింది.


ఏం చేసిందని 9 నెలల చిన్నాపై విధి కక్షకట్టిందని వాపోయింది. ''ఆమె బట్టలు అసభ్యకరంగా ఏమైనా వేసుకుందా..? ఆమె క్లీవేజ్ షో ఏమైనా చేసిందా..? ఆమె తన కాళ్లను ఏమైనా చూపించిందా..? ఆమె తన అభిప్రాయాన్ని గట్టిగా చెప్పిందా..? ఏం చేసింది ఆమె  అంటూ ప్రశ్నించింది. నిజమే ఆ చిన్నారి ఏం చేసిందని ఆ దుర్మార్గుడి కన్ను పడింది..ఇంత దారుణానికి వడిగట్టాడు. ఆ  వ్యక్తిని పబ్లిక్ లో ముక్కలు ముక్కలుగా నరికేయాలని. అలాంటి వాళ్లు సమాజంలో ఉండకూడదని కామెంట్స్ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: