ఓంకార్ దర్శకత్వంలో 2015లో వచ్చిన హారర్ కామెడీ చిత్రం ‘రాజుగారి గది’ ఎంతపెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఓంకార్, తన తమ్ముడు అశ్విన్ బాబును హీరోగా పెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించింది. దీంతో ఓంకార్, రాజుగారి గది చిత్రానికి సీక్వెల్గా ‘రాజుగారి గది 2’ చిత్రాన్ని రూపొందించారు.
కింగ్ నాగార్జున, సమంత వంటి బిగ్ స్టార్లను రంగంలోకి దింపి ‘రాజుగారి గది 2’ చిత్రంపై భారీ హైప్ తీసుకొచ్చాడు ఓంకార్. కానీ, ఈ చిత్రం ఆశించినంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ప్రథమార్ధం బావున్నా, ద్వితీయార్ధం లో ఏమి లేదని విశ్లేషకులు తేల్చి చెప్పేసారు.
ఇప్పుడు ‘రాజుగారి గది 2’ చిత్రానికి సీక్వెల్గా ‘రాజుగారి గది 3’ తెరకెక్కిస్తున్నాడు ఓంకార్. ఈ సారి తమన్నా, అశ్విన్ బాబు ప్రధాన పాత్రలో ఈ చిత్రాన్నీ తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సిినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో స్టార్ మా బిజినెస్ హెడ్ అలోక్ జైన్లు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.
ఈ సినిమాలో ఊర్వశి, అలీ, బ్రహ్మాజీ, హరితేజ, ప్రభాస్ శ్రీను, అజయ్ ఘోష్లు వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఓంకార్ స్వీయ నిర్మాణంలో రూపొందనున్న ఈ చిత్రానికి బుర్రా సాయి మాధవ్ చిత్రానికి డైలాగ్స్ అందిస్తుండగా, చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్గా అందించనున్నాడు.