మండే ఎండలకు వీడ్కోలు పలుకుతూ నిన్న భాగ్యనగరంలో ప్రవేసించిన ఋతుపవనాల వల్ల భారీ వర్షం పడి జన జీవితం అస్తవ్యస్తంగా మారింది. అనేక ముఖ్య ప్రాంతాలలో రోడ్లు చెరువులను తలపిస్తూ పూర్తిగా నిండి పోవడంతో మరొకసారి అంతర్జాతీయ పట్టణం హైదరాబాద్ నిజ స్వరూపం బయటపడింది. 

ఇలాంటి వాన కష్టాలతో జనం సతమతమైపోతూ నానా పాట్లు పడుతున్నా జనానికి సినిమా స్టార్స్ అంటే ఎంత మ్యానియా ఉందో మరొకసారి నిన్న మెట్రోరైలు సాక్షిగా బయటపడింది. హైదరాబాద్ ముఖ్య ప్రాంతాలలో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ లు ఏర్పడి గంటల తరబడి వాహనాలు నిలిచిపోయిన నేపధ్యంలో ఆట్రాఫిక్ లో చిక్కుకున్న హీరో నితిన్ తన ఇంటికి చేరుకోవడానికి మెట్రో ట్రైన్ ఎక్కాడు.

అంతే అప్పటి వరకు వాన సృష్టించిన కష్టాల గురించి మాట్లాడుకుంటున్న జనం అంతా నితిన్ చుట్టూ చేరి సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ముఖ్యంగా ఎక్కువగా అమ్మాయిలు కూడ నితిన్ ఫోటోల కోసం ఎగబడటంతో మెట్రో ట్రైన్ లో నితిన్ మ్యానియా మరొకసారి బయటపడింది. 

‘శ్రీనివాస కళ్యాణం’ సూపర్ ఫ్లాప్ తరువాత ఒక సంవత్సర కాలంగా నితిన్ సినిమాలు ఏమి రాకపోయినా నితిన్ తో ఫోటోల కోసం ఎగబడ్డ జనాన్ని చూస్తే నితిన్ మార్కెట్ పడిపోయింది అని కామెంట్స్ చేస్తున్న వారికి ఆశ్చర్యంకలగక మానదు. ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో హీరోయిన్ రష్మికతో కలిసి నితిన్ చేస్తున్న సినిమాకు నిన్న జరిగిన సంఘటన మంచి మార్కెట్ ను క్రియేట్ చేసే అవకాశం ఉంది..   



మరింత సమాచారం తెలుసుకోండి: