గత ఏడాది చాలా మంచి అప్లాజ్ తెచ్చుకున్న చిన్న చిత్రాల్లో ‘చి ల సౌ’ ఒకటి. నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి తీసిన చిత్రమిది. అతను దర్శకత్వం చేయడమేంటి అంటూ ముందు అందరూ ఆశ్చర్యపోయారు కానీ.. సినిమా చూశాక కానీ అతడి టాలెంట్ ఏంటో అర్థం కాలేదు.

 

తక్కువ బడ్జెట్లో, పరిమిత వనరులతో మంచి సినిమాను అందించాడు రాహుల్. ఈ సినిమాతో హీరో హీరోయిన్లు సుశాంత్, రుహాని శర్మలకు కూడా మంచి పేరొచ్చింది. కెరీర్లో తొలిసారి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాడు సుశాంత్.

 

ఇలాంటి సినిమాను ఎంచుకున్నందుకు.. సింపుల్ యాక్టింగ్‌తో మెప్పించినందుకు అతడికి ప్రశంసలు దక్కాయి. అంతవరకూ ఎలాంటి గుర్తింపు లేని హీరో సుశాంత్ కి ఈ సినిమా ఒక మైలురాయి అని చెప్పవచ్చు. హీరోయిన్ రుహానికి కూడా బాగానే పేరొచ్చింది.

 

చి ల సౌ’తో కమర్షియల్ సక్సెస్ అందుకోకపోయినా.. రాహుల్ టాలెంట్ గుర్తించి అక్కినేని నాగార్జున ‘మన్మథుడు-2’ చేసే అవకాశమిచ్చాడు. రెండో సినిమాకే ఇంత పెద్ద అవకాశం అందుకోవడం చిన్న విషయం కాదు. ఇటీవలే విడుదలైన ‘మన్మథుడు-2’ టీజర్ చూస్తే సినిమా హిట్టయ్యేలాగే కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: