చిరంజీవి ‘సైరా’ అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున విడుదల కావడానికి చిరంజీవి డేట్ డిసైడ్ చేయడంతో ఈమూవీ ఎడిటింగ్ గ్రాఫిక్స్ వర్క్ పై పూర్తి దృష్టి పెట్టారు. అయితే దర్శ‌కుడు సురేందర్ రెడ్డి హీరో చిరంజీవి మ‌ధ్య  ఏర్పడిన గ్యాప్ అలేగే కొనసాగుతోంది అని గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.

తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీ చిత్రీకరణ ముగింపు దశకు చేరుకున్నా ఇప్పటికీ చిరంజీవి సురేందర్ రెడ్డిని నమ్మడం లేదని ఫిలింనగర్ లో ప్రచారం జరుగుతుంది. దీనితో పోస్టు ప్రొడక్షన్ ను పూర్తిగా తన ఆధీనంలోకి చిరంజీవికి తీసుకున్నాడు అని తెలుస్తోంది. 

చిరు స్వయంగా ఎడిటింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఈసినిమాలో ఏది ఉండాలి ఏది ఉండకూడదు అనేదాని మీద ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారట. ఈ విషయంలో చిరంజీవి నిర్ణయమే ఫైనల్ గా అమలు జరుపబడుతోంది అని టాక్.  

దీనికితోడు చారిత్రాత్మక సినిమా చేయడం సురేందర్ రెడ్డికు ఇదే మొదటి సారికావడంతో అతడి తడబాటు ఈమూవీలో ప్రతిచోట కనిపించినట్లు చిరంజీవి అభిప్రాయ పడుతున్నట్లు తెలుస్తోంది.  ఆగ‌స్ట్ 22న చిరంజీవి బ‌ర్త్ డే సంద‌ర్భంగా ‘సైరా’ టీజ‌ర్ ను విడుద‌ల కానున్న పరిస్థుతలలో ఈటీజర్ కటింగ్ విషయంలో కూడ చిరంజీవి పూర్తిగా తల మునకలై ఉన్నట్లు టాక్.  


మరింత సమాచారం తెలుసుకోండి: