చిత్రలహరి విజయం తరువాత కళ్యాణి ప్రియదర్శన్‌ కోలివుడ్‌లోనూ బిజీ నటిగా మారింది. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌, సినియర్‌ నటి లిజి కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్‌. చెన్నెలో పుట్టిపెరిగిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ అఖిల్‌ నటించిన ‘హలో’ చిత్రం ద్వారా చిత్రపరిశ్రమకు పరిచయమైంది.

 

తోలి చిత్రంలోనే మంచి నటిగా గుర్తింపు పోంది ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు కూడా దక్కించుకుంది. ఈ ఎడాది సాయితేజ్‌ సరసన ‘చిత్రలహరి’ చిత్రంలో నటించి మంచి విజయం దక్కించుకుంది. గ్లామర్‌కు దూరంగా డీసెంట్‌ లుక్‌లో కనిపించే అమ్మాయిగా మంచి కథలను ఎంచుకుని నటిస్తోంది.

 

టాలీవుడ్‌లో రెండు విజయాలను సొంతం చెసుకున్న కళ్యాణి ప్రియదర్శన్‌ ప్రస్తుతం కోలీవుడ్‌పై కన్నెసింది. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో శింబు నటిస్తున్న ‘మానాడు’ చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైంది. ప్రస్తుతం ఆమె శివకార్తికేయన్‌ నటిస్తున్న ‘హీరో’ అనే చిత్రంలో, అలాగే మమ్ముటి తనయుడు దుల్కర్‌ సల్మాన్‌తో ‘వాన్‌’ అనే సినిమాలో నటిస్తూ బిజీగా వుంది.

 

ఇప్పుడు శింబుతో జతకట్టనున్న అమ్మడు ఆ చిత్రంలో, తనది ప్రాముఖ్యత వున్న పాత్రని, తన చుట్టూకథ నడుస్తుందని కళ్యాణి ప్రియదర్శన్‌ చెబుతోంది. చూద్దాం మరి, హోమ్లీ గ కనబడుతున్న మన కళ్యాణి ఫ్యూచర్ లో ఎలాంటి విజయాలు అందుకుంటుందో!!


మరింత సమాచారం తెలుసుకోండి: