బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం రాక్షసుడు. రమేష్ వర్మ దర్శకుడు. హవీష్ ప్రొడక్షన్స్ పతాకంపై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

 

ఈ సినిమా హక్కులకు అభిషేక్ పిక్చర్స్ సంస్థ సొంతం చేసుకుంది. జూలై 18న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ 85రోజుల్లో చిత్రీకరణ పూర్తిచేశాం. సినిమా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుంది.

 

అభిషేక్ ఫిల్మ్ ద్వారా విడుదల చేస్తున్నాం అన్నారు. ఓ సైకో కిల్లర్‌ను వేటాడే పోలీసాఫీసర్ కథ ఇది. ఆద్యంత ఉత్కంఠభరితంగా సాగుతుంది. సమాజానికి చక్కటి సందేశం ఉంటుంది. ఇటీవల విడుదలైన టీజర్‌కు అద్భుతమైన స్పందన లభించింది అని దర్శకుడు తెలిపారు.

 

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్ సి దిలీప్, సంగీతం: బిబ్రాన్, దర్శకత్వం: రమేష్‌వర్మ. దాదాపు ఐదారు సినిమాల తరువాత ఓకే డిఫెరెంట్ జోనర్ తో వస్తున్నాడు శ్రీనివాస్ బెల్లంకొండ.  సినిమా ట్రైలర్ చుసిన ప్రతివారు సినిమా హిట్ అని అంటున్నారు. చూద్దాం మరి, ఎంతటి ప్రభంజనం సృష్టిస్తుందో!


మరింత సమాచారం తెలుసుకోండి: