అల్లు అర్జున్ నుండి సినిమా వచ్చి చాలా రోజులు అవుతుంది. "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా" తర్వాత ఇంతవరకు సినిమా రాలేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ఉంటుంది అన్నారు కానీ ఆ సినిమా చాలా ఆలస్యంగా స్టార్ట్ అయింది.  కొద్ది రోజుల క్రితమే ఈ సినిమా పనులు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఇప్పుడు షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది.  ఇంకా దీనికి సంబంధించిన విషయాలు తెలియాల్సి ఉంది.

 

అయితే ప్రస్తుతం ఈ సినిమా నుంది ఒక వార్త బయటకు వచ్చింది. అదేంటంటే, సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుగుతుందట. హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరణ జరుగుతుంది. అటు షూటింగ్ జరుగుతుండగానే మ్యూజిక్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయట. ఈ సినిమాకి థమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.  త్రివిక్రమ్ - థమన్ కాంబినేషన్ లో ఇద్ రెండవ సినిమా. మొదటి సినిమా అయిన " అరవింద సమేత వీర రాఘవ"  మ్యూజిక్ ఎంత సక్సెస్ అయిందో అందరికీ తెలుసు.

 

ఇక అల్లు అర్జున్ సినిమాకి థమన్ సంగీతం అందించడం కూడా రెండవ సారే. సరైనోడు సినిమాలో మంచి మాస్ బీట్స్ ఇచ్చి అందరినీ అలరించాడు.  అందుకని అంచనాలు ఎక్కువగ ఉండడంతో అదిరిపోయే ట్యూన్స్ సిద్ధం చేస్తున్నాడట.హోరెత్తించే మాస్ బీట్స్, వినసొంపైన మెలోడీస్ రెడీ చేస్తున్నట్లు సమాచారం. హారికా హాసిని, గీతా ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హగ్దే మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది

 

తాజాగా సెకండ్ హీరోయిన్ గా నివేత పెత్తురాజ్ ను ఫైనల్ చేసారు. అలాగే అక్కినేని సుమంత్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఫాదర్ సెంటిమెంట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట త్రివిక్రమ్. రీసెంట్ గా టబు కూడా జాయిన్ కాబోతున్నట్టు సమాచారం. టబు ఈ సినిమాలో బన్నీకి తల్లిగా మలయాళ నటుడు జయరాం తండ్రిగా నటిస్తున్నట్లు తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: