గత ఎన్నికలకు ముందు కెఏ పాల్ గురించి పెద్దగా తెలియదు.  తెలియదా అంటే తెలుసు.. కానీ, ఎన్నికల సమయంలోనే ఆయన బాగా పాపులర్ అయ్యారు.  ఎన్నికల సమయంలో కెఏ పాల్ ప్రజాశాంతి పార్టీని స్థాపించి అన్ని స్థానాల్లో పోటీ చేశారు.  ఎక్కడా ఒక్కచోట కూడా విజయం సాధించలేదు.  


ఇక ప్రచారం సమయంలో పాల్ తన వింత వింత చేష్టలతో ఆకట్టుకున్నాడు.  గాల్లోకి పిడిగుద్దులు గుద్దడం.. చేతులు విసరడం.. వంటి చేష్టలతో ఆకట్టుకున్నాడు.  ఓటు వేశాక కూడా పరుగులు తీయడం వంటిది కూడా దానిలో భాగమే అని చెప్పాలి.  


ఇలా వింత మ్యానరిజంతో ఆకట్టుకున్న పాల్ జీవితం ఆధారంగా ఇప్పుడు తెలుగులో సినిమా రాబోతున్నది.  ఓ కొత్త దర్శకుడు.. ఓ ప్రముఖ బ్యానర్లో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.  ఈ సినిమాలో కెఏ పాల్ పాత్రలో సునీల్ కనిపించబోతున్నారు.  


పాల్ మ్యానరిజం ను సునీల్ చేయగలుగుతారు... ఇంతకీ తన జీవిత కథతో సినిమా చేయడానికి కెఏ పాల్ ఒప్పుకుంటాడా లేదా అన్నది తెలియాలి.  మొత్తానికి కెఏ పాల్ కు సంబంధించిన కథను కూడా మనం త్వరలోనే తెరపై చూడబోతున్నామన్నమాట. 


మరింత సమాచారం తెలుసుకోండి: