ఇటీవల ఏపిలో ఎన్నికల సమయంలో విలక్షణ నటుడు మంచు మోహన్ బాబు అధికార పార్టీ పై దుమ్మెత్తి పోశారు.  తన విద్యాసంస్థకు సంబంధించిన పాత బకాయీలు ఏపీ సర్కార్ చెల్లించడం లేదని నిరసనకు దిగారు. ఆ తర్వాత వైసీపీ పార్టీ కండువ కప్పుకున్నారు.  ఈ సమయంలో మాజీ సీఎం చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు.


ఎన్నికల్లో టీడీపీ దారుణంగా ఓడిపోయింది..ప్రస్తుతం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా కొనసాగుతున్నారు.  అయితే ఈ స్టోరీ అంతా ఎందుకంటారా..ఇప్పుడు మంచు వారి అమ్మాయి ఓ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది..ఇంతకీ ఆ ఫోటో ఎవరిదీ అంటారా..చంద్రబాబు-మోహన్ బాబు. వీరిద్దరి భాగస్వామ్యంలో హెరిటేజ్ మిల్క్ సంస్థకు చెందిన ఓ ఔట్ లెట్ కు భూమిపూజ చేస్తున్న ఫొటో ఇది.


నిజంగా అవి అద్భుతమైన రోజులు. కాలం క్రమంగా మారిపోవడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. కూల్ గా కనిపించే టోపీ, కళ్లద్దాలతో అదరగొట్టేశారు నాన్న’ అని మంచు లక్ష్మి ట్వీట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: