చిత్రా ఆర్ట్స్ బ్యానరుపై విజయ్ సేతుపతి 33వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్పీ జననాథన్ శిష్యుడు వెంకట్ కృష్ణన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా గురించి అధికారికంగా ప్రకటించారు. ఇందులో విజయ్ సేతుపతికి జోడీగా అమలాపాల్ను ఎంచుకున్నట్లు వార్తలు వినిపించాయి.
‘తడయరతాక్క’, ‘తడం’ ఫేమ్ మగిళ్తిరుమేని ఈ చిత్రంలో విలన్గా నటించినట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో సినిమా నుంచి అమలాపాల్ తప్పుకున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆమెకు బదులు మేఘ ఆకాశ్ను ఎంపింక చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ఊటీలో మొదలుకానుంది.
ఇంకా ఈ విషయాన్ని చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించలేదు. అంతేకాకుండా అమలాపాల్ తప్పుకోవడానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. ముందు ఒప్పుకున్నప్పుడు అడిగిన రెమ్యూనరేషన్ కన్నా ఇప్పుడు ఎక్కువగా అడగడంతోపాటు పలు షరతులు కూడా ఆమె పెట్టినట్లు వినికిడి.
అందుకే నిర్మాత కాదన్నారని, ఆమె తప్పుకున్నారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాల్షీట్ సమస్య వల్ల ఆమె నటించలేదని కూడా వినిపిస్తోంది. ఏదేమైనా ఇది అమలాపాల్ అభిమానులకొక షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ధనుష్ తో నటించిన వి.ఐ.పి చిత్రం ఆమెకు మంచి పేరు, ప్రఖ్యాతలు తీసుకొచ్చిందని మనందరికీ తెలిసిన విషయమే.