ప్రముఖ నటి, దర్శకురాలు విజయనిర్మల కన్ను మూసారు. హైదరాబాద్ గచ్చిబౌలి లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. విజయ నిర్మల1946 ఫిబ్రవరి 20 న జన్మించారు. 

 

విజయ నిర్మల మత్సరేఖ తమిళ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. సాక్షి చిత్రంతో తొలిసారిగా  కృష్ణతో నటించారు విజయ నిర్మల. కృష్ణ కు కూడా అదే తొలి చిత్రం. కృష్ణతో కలిసి 47 చిత్రాల్లో నటించారు విజయ నిర్మల.

 

తెలుగు, తమిళ, మలయాళంలో మొత్తం 200కుపైగా చిత్రాల్లో నటించారు విజయనిర్మల. సొంత నిర్మాణ సంస్థ విజయకృష్ణ పతాకంపై 15కుపైగా చిత్రాలను నిర్మించారు. విజయ నిర్మల దర్శకత్వం వహించిన తొలి చిత్రం మీనా.

 

మొత్తం 44 చిత్రాలకు దర్శకత్వం వహించారు విజయనిర్మల. అత్యధిక చిత్రాలు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించారు విజయ నిర్మల. మొదటి భర్త కృష్ణమూర్తితో విడిపోయిన అనంతరం ఆమె కృష్ణను రెండో వివాహం చేసుకున్నారు. విజయ నిర్మలకు నరేష్ ఒక్కడే సంతానం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: