అక్కినేని కుటుంబ చిత్రంగా ‘మనం’ సృష్టించిన సంచలనాలు ఒక రికార్డు. అక్కినేని నాగేశ్వరావు చనిపోయిన వెంటనే ఈమూవీ విడుదల అవ్వడంతో తెలుగు ప్రజలు ఈసినిమాను చూడటం అక్కినేనికి ఇచ్చే గౌరవంగా భావించడంతో ఈమూవీ సంచలన విజయం అందుకుంది. 

ఈసినిమాకు దర్శకత్వం వహించిన విక్రమ్ కుమార్ ఈమూవీ తరువాత అనేక సినిమాలు తీసినా ఏసినిమా కూడ ‘మనం’ స్థాయిలో విజయవంతం కాలేదు. ప్రస్తుతం నానీతో ‘గ్యాంగ్ లీడర్’ షూటింగ్ లో ఉన్న విక్రమ్ కుమార్ కు ఒక అద్భుతమైన కథకు సంబంధించిన లైన్ దొరకడంతో విక్రమ్ నాగార్జునను కలిసి ఆ స్టోరీ లైన్ ను చెప్పినట్లు టాక్. 

విక్రమ్ కుమార్ కు వచ్చిన ఆ ఆలోచనకు నాగార్జున మైండ్ బ్లాంక్ అవ్వడమే కాకుండా ఈ స్టోరీ లైన్ ను స్క్రిప్ట్ గా మార్చమని నాగార్జున విక్రమ్ కు చెప్పినట్లు తెలుస్తోంది. తెలుస్తున్న సమాచారం మేరకు విక్రమ్ కుమార్ ఆలోచనలో ఉన్న ఈకథలో నాగార్జునతో పాటు నాగచైతన్య అఖిల్ లకు సమానమైన ప్రాతినిధ్యం ఉండేలా విక్రమ్ స్క్రిప్ట్ ను మలచబోతున్నట్లు తెలుస్తోంది. 

‘మనం’ సినిమాలో ఉన్నట్లుగానే ఈమూవీలో కూడ ఒక షాకింగ్ స్క్రీన్ ప్లే ఉంటుందని సమాచారం. దీనితో ఈసినిమా ‘మనం’ కు సీక్వెల్ గా రాబోతోందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే ఈమూవీ వచ్చే ఏడాది ప్రారంభం అయ్యే ఆస్కారం ఉంది అని అంటున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: