ఛార్మి అంటే గ్లామర్‌కు కేరాఫ్ అడ్రస్. ఆమె కథానాయికగా ఉన్నపుడు ఎలా అందాలు ఆరబోసేదో తెలిసిందే. కెరీర్ ఆరంభంలో ‘శ్రీ ఆంజనేయం’ లాంటి భక్తి నేపథ్యమున్న సినిమాలో ఆమె ఎలా రెచ్చిపోయి అందాల విందు చేసిందో తెలిసిందే. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు. చాలా వరకు గ్లామర్ పాత్రలే చేసింది. ఇప్పుడు నిర్మాతగా మారిన ఛార్మి.. తన ప్రొడక్షన్లో చేస్తున్న హీరోయిన్లకు కూడా తనదైన గ్లామర్ టచ్ ఇస్తోంది.

 

ఇంతకుముందు కొంచెం ట్రెడిషనల్‌గా కనిపించిన అమ్మాయిలు.. ఛార్మి చేతుల్లో పడ్డాక సూపర్ హాట్‌గా తయారవుతున్నారు. ఇందుకు ‘ఇస్మార్ట్ శంకర్’లో రామ్‌తో జత కడుతున్న నిషా అగర్వాల్, నభా నటేష్‌లే ఉదాహరణ. నిధి ఇంతకుముందు తెలుగులో చేసిన ‘సవ్యసాచి’, ‘మిస్టర్ మజ్ను’ సినిమాల్లో చాలా పద్ధతిగా కనిపించింది. గ్లామర్ షో ఏమీ చేయలేదు. కానీ ‘ఇస్మార్ట్ శంకర్’లో ఆమె ఏ స్థాయిలో స్కిన్ షో చేసిందో తాజాగా రిలీజైన ‘ఏమైందో’ పాటతోనే అర్థమైంది.

 

బాలీవుడ్లో చేసిన సినిమాల్లో కూడా నిధి ఇంతగా రెచ్చిపోలేదు. క్లీవేజ్ షోలు, లిప్ లాక్స్‌తో ఆమె రెచ్చిపోయింది. ఇక ‘నన్ను దోచుకుందువటే’లో చాలా ట్రెడిషనల్‌గా కనిపించిన నభా సైతం ‘ఇస్మార్ట్ శంకర్’కు వచ్చేసరికి గ్లామర్ గర్ల్ అయిపోయింది. పోస్టర్లలో ఆమె అందాల విందుకు కుర్రాళ్లు ఫిదా అయిపోతున్నారు. వీళ్లకు ఈ గ్లామర్ టచ్ ఇచ్చింది ఛార్మినేనట.

 

సినిమా మేకింగ్‌లో అన్నీ తానై వ్యవహరిస్తున్న ఛార్మి హీరోయిన్ల స్టైలింగ్, లుక్‌ను కూడా పర్యవేక్షిస్తోంది. ఆమె సూచనల మేరకే హీరోయిన్లను ఇంత సెక్సీగా తయారు చేస్తున్నారట. ‘ఇస్మార్ట్ శంకర్’ను హిట్ చేసి తీరాలని చాలా పట్టుదలతో ఉన్న ఛార్మి.. ఆ దిశగా ఏ చిన్న అవకాశాన్ని వదలట్లేదు. ఇందులో భాగంగానే హీరోయిన్లకు ఈ గ్లామర్ టచ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: