ఇటీవల ‘సండకోళి 2’ చిత్రాన్ని తెరకెక్కించిన లింగుస్వామి త్వరలోనే విక్రం హీరోగా ఓ సినిమాను రూపొందించనున్నారని కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. 2008లో వీరిద్దరి కలయిలో ‘భీమా’ చిత్రం వచ్చింది. అయితే ఈ సినిమా కమర్షియల్‌గా విజయం సాధించలేక పోయింది. ఈ నేపథ్యంలో లింగుస్వామి దర్శకత్వంలో విక్రం నటించడానికి సిద్ధమైనట్లు సమాచారం.

 

విక్రం ‘కడారం కొండాన్‌’ చిత్రంలో నటించారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. మరోవైపు అజయ్‌ జ్ఞానముత్తు దర్శకత్వంలోని చిత్రంలో నటిస్తున్నారు. ఇది కూడా త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల లింగుస్వామి ఓ కమర్షియల్‌ కథను విక్రంకు వినిపించినట్లు సమాచారం. దీనికి ఆయన కూడా ఓకే చెప్పారని తెలుస్తోంది. లింగుస్వామి దర్శకత్వంలోని ‘పయ్యా’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

 

అయితే ఆ తర్వాత వచ్చిన అంజాన్‌, సండకోళి 2 చిత్రాలు ఆశించిన విజయాన్ని ఇవ్వలేకపోయాయి. దీంతో విక్రం సినిమాపై పెద్ద ఎత్తున దృష్టిపెట్టినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం విక్రమ్ కొడుకు హీరోగా చేస్తున్న "ఆదిత్య వర్మ" సినిమా మీద పూర్తి దృష్టి పెట్టాడు విక్రమ్. ఈ సినిమా నుండి దర్శకుడు తప్పుకున్న సంగతి తెలిసిందే.

 

అయితే "అదిత్య వర్మ" సినిమాని  "గిరీశాయ" అనే కొత్త దర్శకుడితో తెరకెక్కిస్తున్నారు. ఇటీవల "ఆదిత్య వర్మ" టీజర్ విడుదల అయింది. ఈ టీజర్ కి మంచి స్పందన వచ్చింది. అయితే విక్రమ్ అర్జుమ్ రెడ్డి దర్శకుడయిన సందీప్ వంగాని ఆదిత్య వర్మ కి సంబంధించి కొన్ని బాధ్యతలు తీసుకోమని రిక్వెస్ట్ చేసాడట. ప్రస్తుతం కొడుకు ధృవ్ లాంచ్ చేసే పనిలీ బిజీగా ఉన్నాడు విక్రమ్.


మరింత సమాచారం తెలుసుకోండి: