'ఓ బేబీ' సినిమా చూశానని, బేబీ అదరగొట్టేసిందని వెంకటేశ్ అన్నారు. సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, క్రాస్ పిక్చర్స్ పతాకాలపై సమంత అక్కినేని, లక్ష్మి, నాగశౌర్య, రావు రమేష్, రాజేంద్రప్రసాద్ ప్రధాన తారాగణంగా బి.వి.నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ' ఓ బేబీ'. సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్రసాద్, హ్యున్ హు, థామస్ కిమ్ నిర్మాతలు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. జులై 5న సినిమాను విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా శనివారం రాత్రి ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. వెంకటేష్ మాట్లాడుతూ 'ఓ బేబీ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, సునీత, వివేక్తో కలిసి ఈ సినిమా చేశారు. వండర్ఫుల్ సబ్జెక్ట్ ఇది. కొత్త ప్రయోగం చేశారు. ప్రాడెక్ట్ చాలా బాగా వచ్చింది. నందిని చాలా బాగా హ్యాండిల్ చేసింది. డిఫరెంట్ ప్లస్ కాంప్లికేటెడ్ సినిమా ఇది...
చాలా బాగా ఎగ్జిక్యూట్ చేసింది. నాకు అందుకు చాలా సంతోషంగా ఉంది. సినిమా చూశా. బేబీ అదరగొట్టేసింది. తన కెరీర్లోనే ఈ సినిమా బెస్ట్గా ఉంటుంది. తను ఔట్స్టాండింగ్గా ఉంటుంది. ఎక్స్ ట్రార్డినరీగా అన్నీ ఎక్స్ ప్రెషన్స్ పండించింది. సమంత చాలెంజింగ్గా తీసుకుని చేసింది' అని అన్నారు. సమంత మాట్లాడుతూ 'హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా చేయడం ఇండిస్టీలో చాలా కష్టం...
ఈ నిర్మాతలు నన్ను నమ్మి ఈ సినిమా చేశారంటే అందుకు కారణం అభిమానులే. వాళ్లే నన్ను ఈ పొజిషన్లో పెట్టారు. నా కెరీర్లో బెస్ట్ ఫిల్మ్ ఇచ్చారు వాళ్లు. ఈ కథను మేం సెలక్ట్ చేయడం కన్నా, ఈ కథే మమ్మల్ని సెలక్ట్ చేసుకుందని నమ్ముతున్నా. ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచీ ఇప్పటిదాకా ప్రతిరోజూ నాకు ఒక సంతోషాన్ని, ఒక ఛాలెంజ్ని ఇచ్చింది.. అంటూ చెప్పుకొచ్చింది.