మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ మూవీ కి సంబంధించిన అప్డేట్ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నది. మే 31 వ తేదీన ప్రారంభమైన ఈ మూవీ ఈనెల 7 వ తేదీ నుంచి కాశ్మీర్ లో షూటింగ్ ప్రారంభం కాబోతున్నది. ఇందులో మహేష్ బాబు ఆర్మీ కి సంబంధించిన సీన్స్ ను షూట్ చేయబోతున్నారు.
వీటితో పాటుగా కాశ్మీర్ లో సరిలేరు నీకెవ్వరూ అనే సాంగ్ ను కూడా షూట్ చేస్తారట. ఈ రెండింటి తరువాత షూటింగ్ కాశ్మీర్ నుంచి షిఫ్ట్ అవుతుంది. కాశ్మీర్ నుంచి షిఫ్ట్ అయ్యాక హైదరాబాద్ లో షూటింగ్ చేస్తారు. ఎఫ్ 2 తరువాత అనిల్ రావిపూడి నిర్మిస్తున్న సినిమా కావడంతో ఆసక్తి నెలకొంది.
మహేష్ వరసగా రెండు హిట్స్ కొట్టిన తరువాత చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. ఇందులో రష్మిక హీరోయిన్ గా చేస్తుంటే.. విజయశాంతి ఓ కీలక పాత్ర చేస్తున్నది. ఈ మూవీకి సంబంధించిన మిగతా విషయాలను త్వరలోనే వెలువరించనున్నారు.
దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ బాబులు సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్నాడు. సంక్రాంతిని టార్గెట్ చేసిన ఈ మూవీ ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నది యూనిట్.