ఇండస్ట్రీలో హిట్ ఉంటేనే మనుగడ సాధించగలం. ఫ్లాపుల్లో ఉంటే ఎవరూ పట్టించుకోరు. దాంతో ఎలాగైనా విజయం సాధించాలని హీరోలంతా కసి మీద ఉంటారు. కానీ కొందరు హీరోలకు మాత్రం అదృష్టం అస్సలు కలిసి రావడం లేదు. ఒకటి రెండు కాదు కొన్నేళ్లుగా వాళ్ళంతా విజయం అనే మాటకు దూరం అయిపోయారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన హీరో అఖిల్. ఈ అక్కినేని హీరోకు ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా లేదు.
ఈయన నటించిన మూడు సినిమాలు ‘అఖిల్’, ‘హలో’ ఫ్లాప్. మొన్న ‘మిస్టర్ మజ్ను’ సినిమా కూడా డిజాస్టర్ కావడంతో నెక్ట్స్ సినిమాతో అయినా విజయం అందుకోవాలని ఆరాటపడుతున్నాడు అక్కినేని వారసుడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిటయ్యాడు అఖిల్ అక్కినేని. ఈయనతో పాటు బెల్లంకొండ శ్రీనివాస్ కూడా ఒక్క హిట్ అంటూ వేచి చూస్తున్నాడు.
2014లో అల్లుడు శీనుతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ.. స్పీడున్నోడు, జయ జానకి నాయకా, సాక్ష్యం, కవచం, సీత సినిమాల్లో నటించాడు. అన్నీ ఫ్లాపులే.ప్రస్తుతం ఈయన నటిస్తున్న రాక్షసుడు సినిమా జులైలోనే విడుదల కానుంది.ఇక కళ్యాణ్ రామ్కు మూడేళ్లుగా ఒక్క విజయం కూడా లేదు. 2015లో వచ్చిన ‘పటాస్’ తర్వాత అన్నీ ఫ్లాపులే ఈ నందమూరి హీరోకు. గతేడాది వచ్చిన ‘యిజం’.. గతేడాది వచ్చిన ‘నా నువ్వే’, ‘ఎమ్మెల్యే’ సినిమాలు కూడా ఫ్లాపయ్యాయి.
ఈ మధ్యే వచ్చిన ‘118’ కూడా పర్లేదనిపించింది కానీ సూపర్ హిట్ కాదు. ఇక ఇష్క్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన నితిన్ పరిస్థితి కూడా అంతే ఉంది. మూడు వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. ఇక రాజ్ తరుణ్ కి కుమారి 21 ఎఫ్ తర్వాత హిట్ రాలేదు. విలన్ నుండి హీరోగా ఎదిగిన గోపీచంద్ కి లౌక్యం తర్వాత ఇంత వరకు హిట్ రాలేదు. మరి వీరందరిని విజయం ఎప్పుడు వరిస్తుందో చూడాలి.