తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు తనయుడు అక్కినేని నాగార్జున్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు.  ప్రస్తుతం ఆయన వారసులు అక్కినేని నాగ చైతన్య, అఖిల్ లు హీరోలుగా నటిస్తున్నారు.  మరోవైపు నాగార్జున కూడా హీరోగా నటిస్తున్నారు. 

 

నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఏం మాయ చేసావే’, ‘మనం’చిత్రాలు తప్ప పెద్దగా హిట్ ఏవీ లేవు.  ఏం మాయ చేసావే చిత్రంలో నటించిన తన సహనటి సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.  పెళ్లైన తర్వాత సమంత నటించిన చిత్రాలు వరుస హిట్స్ అవుతున్నాయి. 

 

ఇక నాగచైతన్య నటించిన చిత్రాలు వరుస ఫ్లాపులవుతున్నాయి. కాకపోతే వీరిద్దరూ కలిసి నటించిన ‘మజిలీ’చిత్రం సూపర్ హిట్ అయ్యింది.  దాంతో చైతూ తదుపరి చిత్రంపై అందరి దృష్టి పడింది. ప్రస్తుతం చైతు, విక్టరీ వెంకటేష్ కలసి వెంకీ మామలో నటిస్తున్నారు.  ఈ క్రేజీ మల్టీస్టారర్ చిత్రాన్ని దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్నాడు.  రియల్ లైఫ్ మామా అల్లులైన చైతు, వెంకీ రీల్ లైఫ్ లో కూడా అదే పాత్రలో నటిస్తున్నారు.

 

తాజాగా వెంకి మామకు సంబంధించిన స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ అవుతుంది. ఈ చిత్రం జ్యోతిష్యం చుట్టూ తిరుగుతుందని..నాగ చైతన్య చిత్రం మొత్తం ప్రమాదాలు ఎదుర్కొంటుంటాడని.. అది వెంకటేష్ వల్లే అని అంటున్నారు. కాకపోతే ఈ చిత్రం తీసే విధానం కడుపుబ్బా నవ్విస్తుందని ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఈ చిత్రంలో రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలో టీజర్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధం అవుతోంది.ఈమద్యే  ఓ హిట్ వచ్చింది.. మళ్ళీ ప్రయేగాలు ఎందుకూ అంటున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: