ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా.. నిధి అగర్వాల్.. నభా నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'ఇస్మార్ట్ శంకర్'. రామ్ - పూరి జగన్నాధ్ కాంబినేషన్లో తెరకెక్కిన మొదటి సినిమా ఇది.  ఈరోజే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో గుమ్మడికాయ ఫంక్షన్ జరిపారు. 

 

ఈ సినిమాను జులై 18 న విడుదల చేస్తామని ఇప్పటికే ఫిలిం మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ ప్రారంభించే సమయంలో కొబ్బరికాయ కొట్టడం. షూటింగ్ పూర్తయిన తర్వాత గుమ్మడికాయ కొట్టి ఫంక్షన్ జరపడం ఆనవాయితీ.  ఈరోజు 'ఇస్మార్ట్ శంకర్' కు గుమ్మడికాయ ఫంక్షన్ జరిపిన ఫోటోలను పూరి కనెక్ట్స్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేస్తూ 'ఇట్స్ ఎ రాప్' అంటూ షూటింగ్ పూర్తయిన విషయాన్నీ తెలిపారు.

 

ఈ ఫోటోలలో రామ్.. నభ నటేష్.. పూరి జగన్నాధ్.. ఛార్మీతో పాటుగా 'ఇస్మార్ట్ శంకర్' టీమ్ మెంబర్స్ అందరూ ఉన్నారు.  హీరోయిన్ నిధి అగర్వాల్ మాత్రం ఈ ఫోటోలలో లేదు. 'ఇస్మార్ట్ శంకర్' సక్సెస్ ఈ సినిమాకు పనిచేసిన అందరికీ చాలా అవసరం.  దాదాపుగా డైరెక్టర్.. హీరో.. హీరోయిన్లు.. అందరూ ఫ్లాపుల్లోనే ఉన్నారు.

 

అయితే ఈ సినిమా ప్రోమోస్ కు.. సాంగ్స్ కు మంచి స్పందన రావడం 'ఇస్మార్ట్ శంకర్' టీమ్ కు కాన్ఫిడెన్స్ ఇస్తోంది.  మరి ఈ చిత్రం అందరికీ ఇస్మార్ట్ హిట్ ఇస్తుందా లేదా అనేది జులై 18 న తేలుతుంది. కానీ, ఎంతో కేర్ తీసుకుని పూరి నిర్మించి, దర్శకత్వం చేసిన సినిమా ఇది.  ఈ మూవీ హిట్ పూరికి చాల కీలకం కూడాను..   


మరింత సమాచారం తెలుసుకోండి: