దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమా కథ విషయంలో గతంలోనూ కాపీ ఆరోపణలు వచ్చాయి. పూరి హాలీవుడ్ సినిమాల స్ఫూర్తితో మెయిన్ లైన్ తీసుకుని దానిని తెలుగు నేటివిటీకి అనుగుణంగా మార్చుకుని సినిమాలు తీశారన్న ఆరోపణలు గతంలో వచ్చాయి. ఇక పూరి గత ఏడు సినిమాలు హిట్ అన్న మాట లేకుండా ఉన్నారు. ఒకదాని తర్వాత మరొకటి వరుసపెట్టి ఎన్ని సినిమాలు చేసినా ప్లాపే అవుతున్నాయి.
తాజాగా ప్లాపుల్లో ఉన్న హీరో నితిన్ను పెట్టి చార్మీ నిర్మాతగా ఇస్మార్ట్ శంకర్ సినిమా తీస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నెల 18న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా కాపీ కథతో తెరకెక్కుతోందని అప్పుడే విమర్శలు స్టార్ట్ అయ్యాయి. 2016 లో రిలీజైన హాలీవుడ్ చిత్రం క్రిమినల్ కథతో ఈ సినిమా కథకు పోలికలు ఉన్నాయట. ఆ సినిమాలో ఓ హ్యాకర్ ని సీఐఏ ఏజెంట్ వెంటాడుతాడు. కానీ ఆ ఏజెంట్ హత్యకు గురవుతాడు.
అప్పుడు అతడి బ్రెయిన్లోని మెమరీస్ను చిప్ ద్వారా క్రిమినల్ బ్రెయిన్లోకి పంపుతారు. చాలా ఇంట్రస్టింగ్గా సాగే ఈ కథలాగే ఇస్మార్ట్ కథ కూడా ఉందంటున్నారు. టీజర్లో ఆల్రెడీ శంకర్ బ్రెయిన్లోకి చింప్ పంపడం కనిపించింది. ఇక ఈ కథ నాదే అని ఓ యువకథా రచయిత దర్శకుల సంఘంలో ఫిర్యాదు చేశారట. దీంతో ఇస్మార్ట్ను రిలీజ్కు ముందు మరో వివాదం వెంటాడింది.