‘ఓ బేబి’ ఓపెనింగ్స్ విషయంలో అనుకున్న స్థాయిలో సంచలనాలు సృష్టించకపోయినా ఈమూవీ కలక్షన్స్ నిన్న విపరీతంగా పుంజుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. నిన్న ఆన్ లైన్ బుకింగ్ లో చాలచోట్ల ‘ఓ బేబి’ టిక్కెట్లు చాలముందుగానే అయిపోవడం జరిగింది. 

ఈరోజు ఆదివారం కూడ కలిసిరావడంతో ‘ఓ బేబి’ కలక్షన్స్ ఫిగర్స్ ను చూసి నిర్మాతలతోపాటు సమంత కూడ మంచి జోష్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సక్సస్ వైపు అడుగులు వేస్తున్న ‘ఓ బేబి’ మూవీ ప్రాజెక్ట్ ను నిర్మించ వద్దు అంటూ ఈమూవీ నిర్మాతలలో కీలక వ్యక్తి అయిన సురేశ్ బాబు సమంత నందినీ రెడ్డి లపై చాల ఒత్తిడి మొదట్లో తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది.

ఇలాంటి కథలను జనం చూడరని సురేశ్ బాబు ఈమూవీ ప్రారంభం ముందు చాల గట్టిగా వాదించినట్లు టాక్. అంతేకాదు ఈమూవీ పై సురేశ్ బాబుకు నమ్మకం లేకపోవడంతో ఈమూవీ ప్రమోషన్ కు కూడా సురేశ్ బాబు దూరంగా ఉన్నాడని అంటారు. దీనితో ఈమూవీ నటీనటుల ఎంపిక నుండి ఈమూవీ ప్రమోషన్ వరకు అన్నీ సమంత సూచనలకు అనుగుణంగా పనులు జరిగాయని ఇండస్ట్రీ వర్గాల టాక్. 

అంతేకాదు ఈమూవీ ప్రారంభానికి ముందు సమంత సురేశ్ బాబుకు ధైర్యం కలిగిస్తూ ఈమూవీ వల్ల నష్టాలు వస్తే తన పారితోషికాన్ని వదులుకోవడమే కాకుండా అవసరం అనుకుంటే నష్టాలను కూడ భరిస్తాను అంటూ సమంత పట్టుదల పట్టడంతో సురేశ్ బాబు ఏమి చేసేదిలేక ఈ సినిమాను నిర్మించాడు అన్న గాసిప్పులు కూడ ఉన్నాయి. అయితే ఈసినిమా విషయంలో సురేశ్ బాబు అంచనాలు తారుమారై అంచనాలు నిజం కావడంతో ప్రస్తుతం దగ్గుబాటి కుటుంబం అంతా సమంత తెలివితేటలను పొగుడుతూ ఆమె పై ప్రశంసలు కురిపిస్తున్నట్లుతెలుస్తోంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: