తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు అద్భుతమైన సాంగ్స్ ని అందించిన గేయ రచయిత భాస్కరభట్లకి ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి విజయలక్ష్మి (67) అనారోగ్యంతో మరణించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవారంలో నివాసముంటున్న ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
ఆమె చికిత్స పొందుతూనే సోమవారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. విజయలక్ష్మి గారికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తెలుగు లో గేయరచయితగా పేరు తెచ్చుకున్న భాస్కరభట్ల పెద్ద కుమారుడు.
విజయలక్ష్మి అంత్యక్రియలు స్థానిక ఇన్నీసుపేట కైలాసభూమిలో మంగళవారం నాడు జరిగాయి. ఆమె మరణవార్త విన్న పలువురు సినీ ప్రముఖులు, సాహితీకారులు, టాలీవుడ్ భాస్కరభట్లకు తమ సానుభూతి తెలిపారు.