తెలుగు ఇండస్ట్రీలో శేఖర్ కమ్ముల తీసిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంలో చిన్న పాత్రలో కనిపించిన విజయ్ దేవరకొండ తర్వాత ‘పెళ్లిచూపులు’చిత్రంతో హీరోగా మారారు. ఆ వెంటనే వచ్చిన ‘అర్జున్ రెడ్డి’చిత్రంతో యూత్ లో తనకంటూ ప్రత్యేక క్రేజ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇక విజయ్ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన ‘గీతా గోవిందం’ మంచి ఫ్యామిలీ ఎంట్రటైన్ మెంట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. ఆ తర్వాత హర్రర్, కామెడీ నేపథ్యంలో వచ్చిన ‘టాక్సీవాలా’తో మరో విజయం అందుకున్నాడు.
ఇలా తీసిన ప్రతి చిత్రం సూపర్ హిట్ కావడంతో విజయ్ దేవరకొండ మూవీస్ పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా భరత్ కమ్మ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ,రష్మిక జంటగా ‘డీయర్ కామ్రెడ్’రూపొందుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ లో రష్మిక స్టేట్ క్రికెట్ ప్లేయర్..అయితే ఆమెను గొప్ప క్రికెట్ ప్లేయర్ చేయాలని ఎన్నో కష్టాలు పడుతున్నట్లు ఈ ట్రైలర్ లో కనిపిస్తుంది.
ఈ మూవీలో కూడా అర్జున్ రెడ్డి లా చాలా కోపిష్టిగా కనిపిస్తున్న విజయ్ దేవరకొండ తర్వాత తన ప్రేమ కోసం ఎలా మారాడు అన్నది చిత్ర కథలా కనిపిస్తుంది. తాను ప్రేమించిన అమ్మాయి కోసం ఎలాంటి త్యాగం చేశాడు అన్నది తెరపై అద్భుతంగా చూపించబోతున్నట్లు కనిపిస్తుంది. లవ్, ఎమోషన్, మెసేజ్ అన్ని కలగలిపినట్లు ఈ ట్రైలర్ లో చూపించారు.
చివరిగా ‘నన్ను భయపెడుతున్నారనుకుంటున్నారేమో..మీరు భయపడుతున్నారు’ అనే పవర్ ఫుల్ డైలాగ్ చూస్తుంటే ఈ మూవీపై భారీ అంచనాలే పెరిగిపోతున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్పై నవీన్ యెర్నేని, రవి శంకర్, మోహన్ చెరుకూరి, యశ్ రంగినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే నెల 31న సినిమాను ప్రేక్షకుల ముందుకు రానున్నది.