మహిళా ప్రధానంగా వచ్చిన ఓ బేబీ సినిమాకి మంచి ఆదరణ లభిస్తుంది. దీన్ని త్వరలో బాలీవుడ్ల రీమేక్ చేయబోతున్నాం అని నిర్మాతలు వివేక కూచిభోట్ల, సునీత అన్నారు. సమంత, నాగక్షౌర్య, లక్ష్మీ, రాజేంద్రప్రసాద్, రావు రమేష్ ప్రధాన పాత్రధారులుగా నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఓ బేబీ చిత్రాన్ని వివేక్ నచూచిబొట్ల, సురేష్బాబు, సునీత, థామస్ సంయుక్తంగా నిర్మించారు. ఇటీవల విడుదలయిన ఇసినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతున్న నేపథ్యంలో శనివారం నిర్మాత సునీత మీడియాతో మాట్లాడుతూ... సౌత్ కొరియన్ సినిమా మిస్గ్రానీ పేరు రీమేక్ ఆ చిత్ర నిర్మాత థామస్ మన ఇండియాలో ఈ సినిమాని రీమేక్ చేద్దామని నవచ్చారు. ఆయనతో నాకు పరిచయం వల్ల తెలుగు పరిశ్రమ గురించి చెప్పి ఇక్కడ తీయాలని ప్రోత్సహించాను.
అలా ఇది సెట్ అయింది. ఈ కథ చేసేటప్పుడు సమంత బాగా సూట్ అవుతుందనిపించింది. సమంతనే నందినిరెడ్డిని దర్శకురాలిగా సజెస్ట్ చేశారు. వృద్ధురాలు పాత్రని మొదట సమంతతోనే చేయిద్దామనుకున్నాం. కానీ సహజత్వం కాదని భావించి లక్ష్మీని సంప్రదించారు. కథలో పెద్దగా మాపెద్దగా మార్పులు చేయలేదు. కాని నేటివిటీ పరమైన మార్పులు చేశారు. సమంత అద్భుతంగా చేసింది. నందినిరెడ్డి అంతే బాగా తెరకెక్కించారు. సినిమాకి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. బన్నీ దీని గురించి ప్రత్యేకంగా ప్రశంచిచారు. సినిమాని చైనా, జపాన్ వియత్నంలో విడుదల చేయాలని అడుగుతున్నారు.
చైనాలో భారీ విడుదల ఉండబోతుంది. అలాగే కన్నడ,బెంగాలీ బాషల వాళ్ళు రీమేక్ అడుగుతున్నారు. ప్రస్తుతం హిందీలో రీమేక్ చేసే ప్లాన్లో ఉన్నాం. సినిమాకి నలుగురం నిర్మాతలమైనా సురేష్బాబు లీడ్ తీసుకుని నడిపించారు. ప్రొడక్షన్స్ పరంగా కూల్గా ఎలా పని చేయించుకోవచ్చో వివేక్ నుంచి నేర్చుకున్నా ఈ చిత్రాన్ని బూసాస్ ఫిల్మ్ ఫెస్టివల్కి పంపిస్తున్నాం. త్వరలో మూడు ప్రాజెక్ట్లతో రాబోతున్నాం. కాప్ కామెడీ యాక్షన్ థ్రిల్లర్ ఒకటి, కొత్త జోనర్లో ఓ సినిమా, క్రైమ్ థ్రిల్లర్గా ఓ సినిమా చేయనున్నాం అని అన్నారు. వివేక్ చెబుతూ, మేం ఊహించినదానికంటే మంచి స్పందన లభిస్తుంది. సురేష్బాబుతో కలిసి చేయడం వల్ల మాకు లాభాలు ఇచ్చి పని నేర్పించారు. సాధారణంగా ప్రొడక్షన్ అనేది చాలా కష్టమైన పని, కానీ ఆయన ఈజీగా ఎలా చేయొచ్చో పని నేర్పించారు. ఇంకా మున్ముందు మా ప్రొడక్షన్లో చాలా మంచి సినిమాలు వస్తాయి. ప్రస్తుతం చేస్తున్న వెంకీమామ 70శాతం షూటింగ్ పూర్తయింది. దసరాకి విడుదలకు ప్లాన్ అని చెప్పారు.